టర్కీ-సిరియా భూకంపం: వైద్య, రెస్క్యూ బృందాలను పంపిన యూఏఈ
- February 07, 2023
యూఏఈ: టర్కీ-సిరియా భూకంప బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడు సహాయక బృందాలకు సూచించారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీలో భూకంపం వల్ల ప్రభావితమైన వ్యక్తుల కోసం ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడంతో పాటు సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ను పంపాలని ఆదేశించారు. అలాగే సిరియన్ అరబ్ రిపబ్లిక్లో భూకంపం వల్ల ప్రభావితమైన వారికి అత్యంత కష్టతరమైన ప్రాంతాలలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడానికి రెస్క్యూ బృందాన్ని, అత్యవసర సహాయ సామాగ్రి, అత్యవసర సహాయాన్ని అందించాలని షేక్ మొహమ్మద్ ఆదేశించారు. భారీ భూకంపాల కారణంగా వేలాది మంది మరణించారు. ఈ రెండు దేశాలకు, వారి ప్రజలకు, యూఏఈ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే ఈ విపత్తులో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని యూఏఈ అధ్యక్షుడు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







