టర్కీ-సిరియా భూకంపం: వైద్య, రెస్క్యూ బృందాలను పంపిన యూఏఈ
- February 07, 2023
యూఏఈ: టర్కీ-సిరియా భూకంప బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడు సహాయక బృందాలకు సూచించారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీలో భూకంపం వల్ల ప్రభావితమైన వ్యక్తుల కోసం ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడంతో పాటు సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ను పంపాలని ఆదేశించారు. అలాగే సిరియన్ అరబ్ రిపబ్లిక్లో భూకంపం వల్ల ప్రభావితమైన వారికి అత్యంత కష్టతరమైన ప్రాంతాలలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడానికి రెస్క్యూ బృందాన్ని, అత్యవసర సహాయ సామాగ్రి, అత్యవసర సహాయాన్ని అందించాలని షేక్ మొహమ్మద్ ఆదేశించారు. భారీ భూకంపాల కారణంగా వేలాది మంది మరణించారు. ఈ రెండు దేశాలకు, వారి ప్రజలకు, యూఏఈ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే ఈ విపత్తులో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని యూఏఈ అధ్యక్షుడు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









