టర్కీ-సిరియా భూకంపం: వైద్య, రెస్క్యూ బృందాలను పంపిన యూఏఈ
- February 07, 2023
యూఏఈ: టర్కీ-సిరియా భూకంప బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడు సహాయక బృందాలకు సూచించారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీలో భూకంపం వల్ల ప్రభావితమైన వ్యక్తుల కోసం ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడంతో పాటు సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ను పంపాలని ఆదేశించారు. అలాగే సిరియన్ అరబ్ రిపబ్లిక్లో భూకంపం వల్ల ప్రభావితమైన వారికి అత్యంత కష్టతరమైన ప్రాంతాలలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడానికి రెస్క్యూ బృందాన్ని, అత్యవసర సహాయ సామాగ్రి, అత్యవసర సహాయాన్ని అందించాలని షేక్ మొహమ్మద్ ఆదేశించారు. భారీ భూకంపాల కారణంగా వేలాది మంది మరణించారు. ఈ రెండు దేశాలకు, వారి ప్రజలకు, యూఏఈ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే ఈ విపత్తులో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని యూఏఈ అధ్యక్షుడు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







