మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా విక్టోరియా గౌరీ ప్రమాణం
- February 07, 2023
న్యూఢిల్లీ: న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ ఇవాళ మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జడ్జిగా ఆమె నియామకాన్ని నిలిపివేయాలని దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సుప్రీంలో ఆ పిటీషన్లపై విచారణ జరుగుతున్న సమయంలోనే.. మద్రాసు హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరీ ప్రమాణ స్వీకారం చేశారు. గౌరీ నియామకాన్ని ఆపివేయాలని, ఆమెకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని హైకోర్టుకు చెందిన బార్ అసోసియేషన్ సుప్రీంలో పిటీషన్ వేసింది.
తమిళనాడులోని మధురైకి చెందిన 54 మంది లాయర్లు.. విక్టోరియా గౌరీ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీం కొలీజియంకు లేఖ రాశారు. మద్రాసు హైకోర్టుకు అనుసంధానమైన మధురై బెంచ్ తరపున గౌరీ ప్రాతినిధ్యం వహించారు. గౌరీకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రిట్ పిటీషన్ను ప్రోత్సహించడంలేదని ధర్మాసనం తెలిపింది.
కాగా, ఈరోజు ఉదయం 10.35 నిమిషాలకు గౌరీ ప్రమాణ స్వీకారం ఉండగా.. సుప్రీంకోర్టు ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను అదే సమయంలో విచారించింది.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







