మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా విక్టోరియా గౌరీ ప్రమాణం
- February 07, 2023
న్యూఢిల్లీ: న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ ఇవాళ మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జడ్జిగా ఆమె నియామకాన్ని నిలిపివేయాలని దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సుప్రీంలో ఆ పిటీషన్లపై విచారణ జరుగుతున్న సమయంలోనే.. మద్రాసు హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరీ ప్రమాణ స్వీకారం చేశారు. గౌరీ నియామకాన్ని ఆపివేయాలని, ఆమెకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని హైకోర్టుకు చెందిన బార్ అసోసియేషన్ సుప్రీంలో పిటీషన్ వేసింది.
తమిళనాడులోని మధురైకి చెందిన 54 మంది లాయర్లు.. విక్టోరియా గౌరీ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీం కొలీజియంకు లేఖ రాశారు. మద్రాసు హైకోర్టుకు అనుసంధానమైన మధురై బెంచ్ తరపున గౌరీ ప్రాతినిధ్యం వహించారు. గౌరీకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రిట్ పిటీషన్ను ప్రోత్సహించడంలేదని ధర్మాసనం తెలిపింది.
కాగా, ఈరోజు ఉదయం 10.35 నిమిషాలకు గౌరీ ప్రమాణ స్వీకారం ఉండగా.. సుప్రీంకోర్టు ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను అదే సమయంలో విచారించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







