600 మంది ఫ్రెషర్స్ను తొలగించిన ఇన్ఫోసిస్
- February 07, 2023
న్యూ ఢిల్లీ: కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు భారతీయ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ షాక్ ఇచ్చింది.దాదాపు 600 మంది ఫ్రెషర్స్ను ఉద్యోగంలోంచి తొలగించింది. సంస్థ నిర్వహించిన ఇంటర్నల్ టెస్టుల్లో ఫెయిలవ్వడం వల్లే ఉద్యోగుల్ని ఇన్ఫోసిస్ తొలగించినట్లు తెలుస్తోంది. కారణం ఏదైతేనేం.. టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఈ జాబితాలో ఇన్ఫోసిస్ కూడా చేరింది. ఇన్ఫోసిస్ వర్గాల ప్రకారం.. గ్రాడ్యుయేషన్ పూర్తైన చాలా మంది సంస్థలో ట్రైనీలుగా చేరుతారు. వీరికి ఉద్యోగంలో చేరిన తర్వాత సంస్థ శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి ఇంటర్నల్గా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే కారణంతో తాజాగా 600 మంది ఫ్రెషర్స్ను ఇన్ఫోసిస్ తొలగించింది. వీరిలో 208 మందిని రెండు వారాలక్రితమే తొలగించింది. అయితే, గత ఏడాది జూలైకి ముందు బెంగళూరులో నియమించుకున్న ఫ్రెషర్స్ను మాత్రం తొలగించలేదని సమాచారం. ఆ తర్వాత నియామకమైన వారిని మాత్రమే కంపెనీ తొలగించింది.
ఈ అంశంపై కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఇంటర్నల్ పరీక్షల్లో ఫెయిలైన వారిని తొలగించడం నిరంతరం జరిగే ప్రక్రియే అని చెప్పారు. ఇన్ఫోసిస్ సంస్థకు ముందు మరో టెక్ సంస్థ విప్రో కూడా ఇలాగే ఉద్యోగుల్ని తొలగించింది. విప్రో సంస్థ కూడా ఇదే పద్ధతిలో ఇటీవల 450 మంది ఫ్రెషర్స్ను తొలగించింది. ఇటీవల కాలంలో టెక్ సంస్థలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య లక్షకుపైగానే ఉంటుందని ఒక అంచనా.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







