ఏపీ సీఎం జగన్ నివాసం పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రత
- February 11, 2023
అమరావతి: సిఎం జగన్ నివాస ప్రాంతంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 1000 మంది సీఎం నివాసం వైపు వస్తారన్న సమాచారం అందడంతో భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాకుండా.. తాడేపల్లి వైపు వస్తున్న అభ్యర్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొన్ని రోజులుగా వారు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించని వారికి మరో ఐదు మార్కులు కలిపితే క్వాలిఫై అవుతారనేది అభ్యర్థుల డిమాండ్. ఈ మేరకు సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు అభ్యర్థులు నేడు తాడేపల్లిల్లోని సీఎం నివాసానికి వచ్చేందుకు రెడీ అయ్యారు.ఈ ఏడాది జనవరి 22న జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు నాలుగున్నర లక్షల పైచిలుకు అభ్యర్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడగా..99 వేల మంది క్వాలిఫై అయ్యారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







