టర్కీ, సిరియాలో పలువురిని రక్షించిన రెస్క్యూ టీమ్స్.. 24 వేలకు చేరిన మరణాలు
- February 12, 2023
యూఏఈ: టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతంలో భూకంపం వచ్చి ఐదు రోజులు దాటింది. కూలిపోయిన ఓఇంటిలో జీవించి ఉన్న ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని టర్కీలోని రెస్క్యూ బృందాలు శనివారం సురక్షితంగా రక్షించాయి. ఇప్పటివరకు భూకంపంలో మృతుల సంఖ్య 25,000కు చేరువైంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య ఆశలు తగ్గుతున్నప్పటికీ, 129 గంటల తర్వాత రెస్క్యూ టీమ్స్ తొమ్మిది మందిని కాపాడారు. వారిలో 16 ఏళ్ల అమ్మాయి, 70 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం కారణంగా వేలాది భవనాలు కూలిపోయి, 24,000 మందికి పైగా మరణించారు. మరో 80,000 మంది వరకు గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలరని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. శిథిలాల మధ్య జీవించి ఉన్నవారిని గుర్తించడంలో సహాయపడటానికి రెస్క్యూ టీమ్స్ థర్మల్ కెమెరాలకు వినియోగిస్తున్నారు. కాగా,ఇండియన్ ఆర్మీ వైద్య సహాయ బృందం నుండి 99 మంది సభ్యుల బృందం గాయపడిన వారికి దక్షిణ నగరంలోని ఇస్కెన్డెరున్లోని తాత్కాలిక ఫీల్డ్ హాస్పిటల్లో చికిత్సలు ప్రారంభించింది. అదే ప్రాంతంలో ఉన్న ఒక ప్రధాన ఆసుపత్రి భూకంపం ధాటికి కుప్పకూలింది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







