టర్కీ, సిరియాలో పలువురిని రక్షించిన రెస్క్యూ టీమ్స్.. 24 వేలకు చేరిన మరణాలు
- February 12, 2023
యూఏఈ: టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతంలో భూకంపం వచ్చి ఐదు రోజులు దాటింది. కూలిపోయిన ఓఇంటిలో జీవించి ఉన్న ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని టర్కీలోని రెస్క్యూ బృందాలు శనివారం సురక్షితంగా రక్షించాయి. ఇప్పటివరకు భూకంపంలో మృతుల సంఖ్య 25,000కు చేరువైంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య ఆశలు తగ్గుతున్నప్పటికీ, 129 గంటల తర్వాత రెస్క్యూ టీమ్స్ తొమ్మిది మందిని కాపాడారు. వారిలో 16 ఏళ్ల అమ్మాయి, 70 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం కారణంగా వేలాది భవనాలు కూలిపోయి, 24,000 మందికి పైగా మరణించారు. మరో 80,000 మంది వరకు గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలరని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. శిథిలాల మధ్య జీవించి ఉన్నవారిని గుర్తించడంలో సహాయపడటానికి రెస్క్యూ టీమ్స్ థర్మల్ కెమెరాలకు వినియోగిస్తున్నారు. కాగా,ఇండియన్ ఆర్మీ వైద్య సహాయ బృందం నుండి 99 మంది సభ్యుల బృందం గాయపడిన వారికి దక్షిణ నగరంలోని ఇస్కెన్డెరున్లోని తాత్కాలిక ఫీల్డ్ హాస్పిటల్లో చికిత్సలు ప్రారంభించింది. అదే ప్రాంతంలో ఉన్న ఒక ప్రధాన ఆసుపత్రి భూకంపం ధాటికి కుప్పకూలింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







