పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..
- February 12, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం ప్రకటించింది.
ప్రస్తుతం ఏపీకి గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ను నియమించింది. ఇక బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమించారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఎస్.అబ్దుల్ నజీర్ జనవరి 4న రిటైర్ అయ్యారు. ఇక అయోధ్య తీర్పుఇచ్చిన ఐదుగురు జడ్జిలలో ఈయన కూడా ఒకరు. ఇక ఇతర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం అయ్యారు.
మేఘాలయ గవర్నర్ గా చౌహన్
మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బైస్
నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా త్రివిక్రమ్ పట్నాయక్
మణిపూర్ గవర్నర్ గా అనసూయ
బీహార్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్
సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్
అస్సాం గవర్నర్ గా గులాబీ చంద్ కటారియా
జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మిశ్రాను కేంద్రం నియమించింది.
ఇక మహారాష్ట్ర గవర్నర్ భగవంత్ కొశ్యారి, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణన్ మాథూర్ ల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీనితో ఆయా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







