15 ఏళ్ల తర్వాత నిందితుడిని పట్టించిన బంగారు పళ్లు
- February 12, 2023
ముంబాయి: పరారీలో ఉన్న 38 ఏళ్ల ప్రవీణ్ అశుభ జడేజా అకాని 15 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అతని రెండు బంగారు పళ్ల ద్వారా అతడిని గుర్తించినట్లు ముంబై పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు తన గుర్తింపును మార్చుకుని గుజరాత్కు మారినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రవీణ్ మోసం, పోలీసులను తప్పుదారి పట్టించాడని అభియోగాలు మోపారు. అరెస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత, నిందితుడికి కోర్టు నుండి బెయిల్ వచ్చింది. తరువాత, విచారణ తర్వాత, నిందితుడు ముంబై నుండి పారిపోయాడు. అందుకే కోర్టు అతన్ని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించిందని అని పోలీసు అధికారి తెలిపారు. ప్రవీణ్ 2007లో ఓ బట్టల దుకాణంలో సేల్స్మెన్గా పనిచేసేవాడు. అతని యజమాని ఒకసారి మరో వ్యాపారి నుంచి రూ.40,000 తీసుకురావాలని చెప్పాడు. ఆ డబ్బును తన యజమానికి ఇవ్వకుండా, ప్రవీణ్ పోలీసులను, యజమానిని తప్పుదోవ పట్టించాడు. మరుగుదొడ్డి నుండి అతని డబ్బుల బ్యాగ్ ని ఎవరో దొంగిలించారని నాటకం ఆడాడని పోలీసు అధికారి వివరించారు. విచారణ అనంతరం ప్రవీణ్ డబ్బును తన వద్దే పెట్టుకొని పోలీసులను తప్పుదోవ పట్టించాడని తేలిందని ముంబై పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







