విద్యార్థుల కోసం AI ట్యూటర్: యూఏఈ
- February 14, 2023
యూఏఈ: విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ట్యూటర్ను అభివృద్ధి చేసి త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు యూఏఈ విద్యాశాఖ మంత్రి అహ్మద్ బెల్హౌల్ అల్ ఫలాసి తెలిపారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023లో ఒక సెషన్లో విద్యా మంత్రి అల్ ఫలాసి పాల్గొని ప్రసంగించారు. AI సాంకేతికతలను మెరుగుపరచడానికి విద్యా మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐలతోపాటు ఇతర టెక్ కంపెనీల వంటి భాగస్వాములతో కలిసి పని చేస్తుందని తెలిపారు. AI ట్యూటర్ ను పాఠ్యాంశాలు నుండి మూల్యాంకనం వరకు అన్న విభాగాల్లో సమర్థవంతంగా పనిచేసేలా అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ వివిధ భాగస్వాములతో కలిసి పని చేస్తుందని తెలిపారు. ఓపెన్ AI వంటి అధునాతన అభ్యాస నమూనాలను ఉపయోగించడం ద్వారా తమ విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యామంత్రి పేర్కొన్నారు. సబ్జెక్టులపై విద్యార్థుల అవగాహనను మెరుగుపరచడానికి, తక్షణ అభిప్రాయాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని అందించడానికి, అభ్యాసాన్ని ఆకర్షణీయంగా.. ఇంటరాక్టివ్గా మార్చడానికి ఈ కొత్త-యుగం ఏఐ ట్యూటర్ రూపొందించబడిందని బెల్హౌల్ అల్ ఫలాసి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







