మోసం, దొంగతనాలకు పాల్పడిన నిర్వాసితులు అరెస్టు
- February 14, 2023
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లో షాపు యజమానులను మోసగించిన ఆరోపణలపై ఇద్దరు ప్రవాస మహిళలు, ఒక వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ పరిధిలో దుకాణయజమానులను మోసం చేసిన కేసులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరబ్ జాతీయులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులు ముందుగా కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఆ తర్వాత బిల్లింగ్ కూడా వేయించి.. ఆపై బిల్లు మొత్తాన్ని చెల్లించకుండానే ఆ వస్తువులను తిరిగి ఇచ్చేసి బిల్లు మొత్తాన్ని వాపస్ చేయాలని డిమాండ్ చేశారని పోలీసులు వివరించారు. మరో కేసులో నివాస భవనాల నుండి అనేక దొంగతనాలకు పాల్పడిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ అరెస్టు చేసిందని, అతడిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









