మోసం, దొంగతనాలకు పాల్పడిన నిర్వాసితులు అరెస్టు
- February 14, 2023
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లో షాపు యజమానులను మోసగించిన ఆరోపణలపై ఇద్దరు ప్రవాస మహిళలు, ఒక వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ పరిధిలో దుకాణయజమానులను మోసం చేసిన కేసులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరబ్ జాతీయులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులు ముందుగా కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఆ తర్వాత బిల్లింగ్ కూడా వేయించి.. ఆపై బిల్లు మొత్తాన్ని చెల్లించకుండానే ఆ వస్తువులను తిరిగి ఇచ్చేసి బిల్లు మొత్తాన్ని వాపస్ చేయాలని డిమాండ్ చేశారని పోలీసులు వివరించారు. మరో కేసులో నివాస భవనాల నుండి అనేక దొంగతనాలకు పాల్పడిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ అరెస్టు చేసిందని, అతడిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







