నివాస భవనంలో అగ్ని ప్రమాదం.. 11 మందికి అస్వస్థత
- February 18, 2023
యూఏఈ: అజ్మాన్లోని నివాస భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, పోలీస్ విభాగాలు మంటలను అదుపు చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎమిరేట్లోని అల్ రషీదియా ప్రాంతంలోని పెరల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ టవర్లలో ఒకదానిలో అగ్ని ప్రమాదం జరిగింది. అజ్మాన్ పోలీస్ కమాండర్ జనరల్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి పర్యవేక్షణలో మంటలను అదుపు చేశారు. పోలీసులు, పౌర రక్షణ దళాలు టవర్ను ఖాళీ చేయించారు. ప్రమాద స్థలంలో శీతలీకరణ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మంటలు అనేక అపార్ట్మెంట్లకు చేరాయని, పొగ కారణంగా తొమ్మిది మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలంలో తొమ్మిది మందికి చికిత్స అందించాయని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







