నివాస భవనంలో అగ్ని ప్రమాదం.. 11 మందికి అస్వస్థత
- February 18, 2023
యూఏఈ: అజ్మాన్లోని నివాస భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, పోలీస్ విభాగాలు మంటలను అదుపు చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎమిరేట్లోని అల్ రషీదియా ప్రాంతంలోని పెరల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ టవర్లలో ఒకదానిలో అగ్ని ప్రమాదం జరిగింది. అజ్మాన్ పోలీస్ కమాండర్ జనరల్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి పర్యవేక్షణలో మంటలను అదుపు చేశారు. పోలీసులు, పౌర రక్షణ దళాలు టవర్ను ఖాళీ చేయించారు. ప్రమాద స్థలంలో శీతలీకరణ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మంటలు అనేక అపార్ట్మెంట్లకు చేరాయని, పొగ కారణంగా తొమ్మిది మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలంలో తొమ్మిది మందికి చికిత్స అందించాయని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









