బాహుబలి ని వరించిన జాతీయ పురస్కారం
- May 03, 2016
'బాహుబలి' సినిమా ఘనత మరోసారి జాతీయస్థాయిలో మార్మోగింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ సినిమాకు గాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు అందించారు. జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ నటిగా ఎంపికైన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ లు కూడా ప్రణబ్ చేతుల మీదుగా అవార్డులను స్వీకరించారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఘనంగా జరిగిన 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ అవార్డులను అందజేశారు. వెటరన్ హీరో మనోజ్ కుమార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
పీకూ సినిమాలో నటనకుగాను అమితాబ్ కు, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలో అత్యుత నటన ప్రదర్శించిన కంగనాకు ఈ అవార్డులకు ఎంపికైన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.జాతీయ అవార్డుల విజేతలు ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (పికు) ఉత్తమ నటి: కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ కొరియోగ్రాఫర్: రెమో డిసౌజా (బాజీరావు మస్తానీ) ఉత్తమ హిందీ చిత్రం: దమ్ లగాకే హైసా ఉత్తమ తెలుగు చిత్రం: కంచె ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: నీరజ్ ఘేవాన్ (మసాన్) ఉత్తమ స్పెషల్ ఎఫెక్టులు: బాహుబలి ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్ చటర్జీ (బాజీరావు మస్తానీ) ఉత్తమ సహాయనటుడు: సముద్రకని (విసారనై) ఉత్తమ సహాయనటి: తన్వీ అజ్మీ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ బాల నటుడు: గౌరవ్ మీనన్ (బెన్) ఉత్తమ బాలల చలనచిత్రం: దురంతో జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రం: నానక్ షా ఫకీర్ పర్యావరణ పరిరక్షణపై ఉత్తమచిత్రం: వాలియా చారకుల్ల పక్షికల్ ఉత్తమ గాయని: మోనాలి ఠాకూర్ (మోహ్ మోహ్ కే ధాగే.. దమ్ లాగాకే హైసా) ఉత్తమ వినోదాత్మక చిత్రం: బజరంగీ భాయీజాన్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: విశాల్ భరద్వాజ్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జుహు చతుర్వేది (పికు), హిమాన్శు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్) ఉత్తమ కొరియోగ్రఫీ: రెమో డిసౌజా (బాజీరావ్ మస్తానీలో 'దివానీ మస్తానీ' పాట) ఉత్తమ చలనచిత్రం (నర్గీస్ దత్ జాతీయ సమైక్యత పురస్కారం): నానక్ షా ఫకీర్
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







