ఢిల్లీ, చెన్నైలో భూప్రకంపనలు..
- February 22, 2023
ఢిల్లీ, చెన్నైలో ఇవాళ భూప్రకంపనలు సంభవించాయి. చెన్నైలోని అన్నా మౌంట్ రోడ్, ఈరోడ్, అన్నశాలై ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరి కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1.35 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.
అయితే, మెట్రో నిర్మాణ పనుల వల్ల ప్రకంపనలు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. మెట్రో అధికారులు మాత్రం ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం మెట్రో పనులు జరగడం లేదని చెప్పారు. మరోవైపు, నేపాల్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ లోని జమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంపకేంద్రం ఉందని అధికారులు చెప్పారు.
భూప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అలాగే, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్ లో భూకంప ప్రభావంతో ఉత్తర భారత్ లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పస్థాయి భూప్రకంపనలు సంభవించాయి.
తాజా వార్తలు
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







