దుబాయ్ నివాసితులకు శుభవార్త.. కుటుంబం, స్నేహితుల కోసం 90 రోజుల విజిట్ వీసా
- February 23, 2023
యూఏఈ: తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఆతిథ్యం ఇవ్వాలనుకునే దుబాయ్ నివాసితులు ఇప్పుడు 3 నెలల విజిట్ వీసాను పొందవచ్చు. ఈ వీసా కోసం హోస్ట్ తిరిగి చెల్లించే డిపాజిట్ Dh1,000 చెల్లించాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. దుబాయ్కి చెందిన ఓ కంపెనీకి పీఆర్ఓగా పనిచేస్తున్న కేవీ.. తన కంపెనీ ఉద్యోగుల కోసం ఈ వీసాలను దక్కించుకున్నట్లు తెలిపారు. ఇందు కోసం డిపాజిట్ కింద Dh1,000, టైపింగ్ ఛార్జీలు, సర్వీస్ ఫీజు Dh770 అయిందన్నారు. అక్టోబరు 2022లో అడ్వాన్స్డ్ వీసా సిస్టమ్లో భాగంగా యూఏఈలో ప్రవేశ వీసాలలో విస్తృత సంస్కరణలు చేశారు.
ట్రావెల్ ఏజెన్సీల ప్రకారం.. ఈ వీసాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోలేరని, సిస్టమ్లో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ వీసాలను పొందగలరని స్మార్ట్ ట్రావెల్స్ కు చెందిన అఫీ అహ్మద్ తెలిపారు.వ్యక్తులు తప్పనిసరిగా GDRFA వెబ్సైట్లో, యాప్లో లేదా అమెర్ టైపింగ్ సెంటర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
GDRFA వెబ్సైట్లో వినియోగదారులు వ్యాపారం లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఎంట్రీ పర్మిట్లు, వారి గ్రీన్ వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంట్రీ పర్మిట్లు, అలాగే పేషెంట్ ఎస్కార్ట్ పర్మిట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధునాతన వీసా సేవలలో భాగంగా కొత్త ప్రవేశ అనుమతులను ప్రవేశపెట్టారు. వాటిలో కొన్ని జాబ్ ఎక్స్ప్లోరేషన్ ఎంట్రీ వీసా, ఒకటి బిజినెస్ ఎంట్రీకి, ఐదేళ్ల మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా, ఒకటి వైద్య చికిత్స కోసం, తాత్కాలిక పని కోసం, చదువులు, శిక్షణ కోసం ఇలా అనేక రకాల వీసాలను యూఏఈ తీసుకొచ్చింది. ICA తన స్మార్ట్ సర్వీస్ సిస్టమ్లో ఫిబ్రవరి 1 నాటికి అప్డేట్ చేసిన 15 సేవలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
తాజా వార్తలు
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!







