శుభవార్త.. ఫిబ్రవరి 25 నుండి ఓవర్స్టే జరిమానాలు, పర్మిట్ల క్రమబద్ధీకరణ
- February 24, 2023
యూఏఈ: వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) గుడ్ న్యూస్ చెప్పింది. వీసా సమస్యలు ఉన్న నివాసితులు, సందర్శకులు, పర్యాటకుల కోసం దీరా సిటీ సెంటర్లో 'అందరికీ హోమ్ల్యాండ్' పేరుతో 3-రోజుల క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25 నుండి 27 వరకు ప్రతిరోజూ నిర్వహించే ఈ క్యాంపెయిన్ లో పలు వీసా సమస్యలను పరిష్కరించనున్నారు. వీసా గడువు ముగిసిన వారు, వీసా అనుమతి కంటే ఎక్కువ కాలం గడిపిన వారితో సహా వీసాలో ఏవైనా సమస్యలు ఉన్నవారికి సహాయం చేయడానికి సెంటర్పాయింట్కు సమీపంలోని డెయిరా సిటీ సెంటర్లోని ఏర్పాటు చేసిన స్టాల్లో ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు GDRFA అధికారులు అందుబాటులో ఉంటారు. వీసా సమస్యలున్న వారు స్టాల్ వద్దకు రావాలని GDRFAలోని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సలేం బిన్ అలీ సూచించారు. యూఏఈలో అనుమతించబడిన వీసా వ్యవధి కంటే ఎక్కువ కాలం గడిపినందుకు రోజుకు Dh50 జరిమానా విధించబడుతుంది. దాంతోపాటు వీసా రద్దుకు కూడా దారితీసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









