శుభవార్త.. ఫిబ్రవరి 25 నుండి ఓవర్స్టే జరిమానాలు, పర్మిట్ల క్రమబద్ధీకరణ
- February 24, 2023
యూఏఈ: వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) గుడ్ న్యూస్ చెప్పింది. వీసా సమస్యలు ఉన్న నివాసితులు, సందర్శకులు, పర్యాటకుల కోసం దీరా సిటీ సెంటర్లో 'అందరికీ హోమ్ల్యాండ్' పేరుతో 3-రోజుల క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25 నుండి 27 వరకు ప్రతిరోజూ నిర్వహించే ఈ క్యాంపెయిన్ లో పలు వీసా సమస్యలను పరిష్కరించనున్నారు. వీసా గడువు ముగిసిన వారు, వీసా అనుమతి కంటే ఎక్కువ కాలం గడిపిన వారితో సహా వీసాలో ఏవైనా సమస్యలు ఉన్నవారికి సహాయం చేయడానికి సెంటర్పాయింట్కు సమీపంలోని డెయిరా సిటీ సెంటర్లోని ఏర్పాటు చేసిన స్టాల్లో ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు GDRFA అధికారులు అందుబాటులో ఉంటారు. వీసా సమస్యలున్న వారు స్టాల్ వద్దకు రావాలని GDRFAలోని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సలేం బిన్ అలీ సూచించారు. యూఏఈలో అనుమతించబడిన వీసా వ్యవధి కంటే ఎక్కువ కాలం గడిపినందుకు రోజుకు Dh50 జరిమానా విధించబడుతుంది. దాంతోపాటు వీసా రద్దుకు కూడా దారితీసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







