మతాన్ని కించపరిచేలా వీడియోలు.. ముగ్గురిపై ట్రయల్
- February 25, 2023
బహ్రెయిన్: తజ్దీద్ సొసైటీకి చెందిన ముగ్గురు సభ్యులు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులపై నాల్గవ మైనర్ క్రిమినల్ కోర్టులో విచారణ ప్రరంభమైంది. అనుమానితులపై ఇస్లాం మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలను అపహాస్యం చేశారని ఆరోపణల కింద కేసులు నమోదు చేశారు. మతపరమైన చిహ్నాలను, ఇస్లామిక్ విశ్వాసాన్ని బహిరంగంగా అపహాస్యం చేస్తూ సొసైటీ సభ్యులు యూట్యూబ్ వీడియోలను పోస్ట్ చేశారని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. వారిపై బహ్రెయిన్ శిక్షాస్మృతి నిబంధనల ప్రకారం నిందితుల చర్యలు ప్రాథమికంగా నేరాలుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. భావప్రకటనా స్వేచ్ఛ హక్కును అంగీకరిస్తూనే, తాజ్దీద్ సొసైటీ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి మించి ప్రవర్తించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ప్రజల మధ్య సామరస్యాన్ని దేబ్బతీశారని, మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నారని, వారు తప్పుడు వాదనలు, విశ్వాసం రాజ్యాంగ హక్కును ఉల్లంఘించారని ప్రాసిక్యూటర్లు కోర్టులో తెలిపారు. కాగా, విచారణ సమయంలో ఇద్దరు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. నిందితుల తరఫు న్యాయవాదులు మరింత సమయం కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







