మతాన్ని కించపరిచేలా వీడియోలు.. ముగ్గురిపై ట్రయల్
- February 25, 2023
బహ్రెయిన్: తజ్దీద్ సొసైటీకి చెందిన ముగ్గురు సభ్యులు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులపై నాల్గవ మైనర్ క్రిమినల్ కోర్టులో విచారణ ప్రరంభమైంది. అనుమానితులపై ఇస్లాం మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలను అపహాస్యం చేశారని ఆరోపణల కింద కేసులు నమోదు చేశారు. మతపరమైన చిహ్నాలను, ఇస్లామిక్ విశ్వాసాన్ని బహిరంగంగా అపహాస్యం చేస్తూ సొసైటీ సభ్యులు యూట్యూబ్ వీడియోలను పోస్ట్ చేశారని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. వారిపై బహ్రెయిన్ శిక్షాస్మృతి నిబంధనల ప్రకారం నిందితుల చర్యలు ప్రాథమికంగా నేరాలుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. భావప్రకటనా స్వేచ్ఛ హక్కును అంగీకరిస్తూనే, తాజ్దీద్ సొసైటీ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి మించి ప్రవర్తించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ప్రజల మధ్య సామరస్యాన్ని దేబ్బతీశారని, మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నారని, వారు తప్పుడు వాదనలు, విశ్వాసం రాజ్యాంగ హక్కును ఉల్లంఘించారని ప్రాసిక్యూటర్లు కోర్టులో తెలిపారు. కాగా, విచారణ సమయంలో ఇద్దరు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. నిందితుల తరఫు న్యాయవాదులు మరింత సమయం కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







