పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కు అస్వస్థత

- February 27, 2023 , by Maagulf
పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కు అస్వస్థత

హైదరాబాద్‌: ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ లోని సిటీన్యూరో ఆసుపత్రిలో ఆయనను కుటుంబసభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డి.శ్రీనివాస్ టిఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను కెసిఆర్ రాజ్యసభకు పంపారు. అయితే టిఆర్ఎస్ లో ఆయన ఇమడలేకపోయారు. సొంత పార్టీ నుంచే ఆయనకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా లేకపోవడం గమనార్హం. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపి ఎంపీగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com