విటమిన్ ‘డి’ లోపిస్తే కలిగే అనర్ధాలేంటో తెలుసా.?
- February 27, 2023
శరీరంలో ఎముకలు బలిష్టంగా వుండాలంటే తగిన మోతాదులో శరీరానికి విటమిన్ డి లభించాలి. ఉదయాన్నే వచ్చే లేలేత సూర్య కిరణాలు.. సాయంత్రం తాకే సూర్య కిరణాల్లో విటమిన్ డి అధికంగా వుంటుందన్న సంగతి తెలిసిందే.
అందుకే, ఉదయం, సాయంత్రం కాసేపు ఎండలో వుంటే విటమిన్ డి ఫుష్కలంగా లభిస్తుందని చెబుతుంటారు. అవును నిజమే. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఎండకు చాలా దూరంగా జీవిస్తున్నారు. నాగరికత పేరు చెప్పి, ఏసీ రూముల్లోనూ వెంటిలేషన్ లేని ఇళ్లలోనూ జివించాల్సి వస్తోంది. ఈ కారణంగా విటమిన్ డి బాధితులు అధికమవుతున్నారు.
విటమిన్ డి లోపిస్తే.. ఎముకలు పలచబడిపోయి పటుత్వం కోల్పోతాయ్. దాంతో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఆస్థియోఫోరోసిస్ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. తొందరగా అలిసిపోవడం, కండరాలు పట్టేయడం వంటి సమస్యల్ని కూడా సాధారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.
అందుకే, ఎండతో పాటూ, విటమిన్ డి సమృద్ధిగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడంతో పాటూ, కనీసం రోజులో అరగంటైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అలాగే, శారీరక శ్రమ, చిన్నపాటి వ్యాయామాలు, నడక, యోగా వంటివి చేయడం తప్పని సరి అని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..