విటమిన్ ‘డి’ లోపిస్తే కలిగే అనర్ధాలేంటో తెలుసా.?
- February 27, 2023శరీరంలో ఎముకలు బలిష్టంగా వుండాలంటే తగిన మోతాదులో శరీరానికి విటమిన్ డి లభించాలి. ఉదయాన్నే వచ్చే లేలేత సూర్య కిరణాలు.. సాయంత్రం తాకే సూర్య కిరణాల్లో విటమిన్ డి అధికంగా వుంటుందన్న సంగతి తెలిసిందే.
అందుకే, ఉదయం, సాయంత్రం కాసేపు ఎండలో వుంటే విటమిన్ డి ఫుష్కలంగా లభిస్తుందని చెబుతుంటారు. అవును నిజమే. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఎండకు చాలా దూరంగా జీవిస్తున్నారు. నాగరికత పేరు చెప్పి, ఏసీ రూముల్లోనూ వెంటిలేషన్ లేని ఇళ్లలోనూ జివించాల్సి వస్తోంది. ఈ కారణంగా విటమిన్ డి బాధితులు అధికమవుతున్నారు.
విటమిన్ డి లోపిస్తే.. ఎముకలు పలచబడిపోయి పటుత్వం కోల్పోతాయ్. దాంతో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఆస్థియోఫోరోసిస్ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. తొందరగా అలిసిపోవడం, కండరాలు పట్టేయడం వంటి సమస్యల్ని కూడా సాధారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.
అందుకే, ఎండతో పాటూ, విటమిన్ డి సమృద్ధిగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడంతో పాటూ, కనీసం రోజులో అరగంటైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అలాగే, శారీరక శ్రమ, చిన్నపాటి వ్యాయామాలు, నడక, యోగా వంటివి చేయడం తప్పని సరి అని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు “బెస్ట్ పెవిలియన్ కంటెంట్” అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?