OTT లో సందడి చేస్తున్న వీరయ్య
- February 27, 2023
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య ఓటిటిలోకి వచ్చేసింది. బాబీ – చిరంజీవి కలయికలో శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ కీలక పాత్రలో నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. టాక్ పరంగానే కాదు వసూళ్ల పరంగా కూడా మెగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించడం స్టార్ట్ చేసింది.
బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతు వచ్చింది. ఓ వైపు ధియేటర్లో కనకవర్షం కురిపిస్తూనే..ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవికి ఇదే మేజర్ హిట్ అని చెప్పవచ్చు. ఆచార్య డిజాస్టర్గా నిలిస్తే..గాడ్ ఫాదర్ యావరేజ్గా ఆకట్టుకుంది. వాల్తేరు వీరయ్య మాత్రం పూనకాలు తెప్పిస్తోంది.
ఇక ఈ మూవీ హిట్ తో చిరు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో వేదాళం రీమేక్ భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా శరవేగంగా జరుగుతుంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







