ఒమన్లో 600 మందికి పైగా ప్రవాస కార్మికులు అరెస్ట్
- March 06, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో 600 మందికి పైగా ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరి 2023లో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల సంఖ్య 626గా ఉంది. ఇందులో తమ స్పాన్సర్లను వదిలి ఇతరుల కోసం పనిచేస్తున్న 230 మంది ప్రవాసులు ఉన్నారు. 319 మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టగా.. వారిలో 77 మంది ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. మరోవైపు ఫిబ్రవరి 2023లో బహిష్కరించబడిన ప్రవాసుల సంఖ్య 391 మంది కార్మికులకు చేరుకుంది. ఇందులో 68 మంది తమ స్పాన్సర్లను విడిచిపెట్టి ఇతరుల కోసం పనిచేస్తున్నారు. 214 మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. వారిలో 109 మంది ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారని కార్మిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







