ఈద్ అల్ ఫితర్..4 రోజుల సెలవు: భారీగా పెరగనున్న విమాన ఛార్జీలు!
- March 10, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా UAE నివాసితులకు వరుసగా 4 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు ఏప్రిల్ 21(శుక్రవారం)న ఉంటుంది. దీంతో నివాసితులకు ఏప్రిల్ 20, గురువారం నుండి ఏప్రిల్ 23 ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు సెలవులు లభిస్తాయి. ఈ నేథ్యంలో యూఏఈ నుండి ప్రముఖ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు ఇప్పటికే సుమారు 15 శాతం పెరిగాయను ట్రావెల్ ఏజెంట్స్ తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో పాఠశాలలకు వసంత విరామం ఉండటంతో కుటుంబాలు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ Musafir.com ప్రకారం, ట్రావెల్ ప్యాకేజీల కోసం 30 శాతం డిమాండ్ ఉంది.ఎక్కువగా అజర్బైజాన్, జార్జియా, అర్మేనియా, సింగపూర్, కెన్యా, థాయ్లాండ్, మలేషియాతో పాటు కజకిస్తాన్, కిర్గిజ్స్థాన్ లకు వెళ్లేందుకు డిమాండ్ ఉందని ప్లూటో ట్రావెల్స్లో మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని చెప్పారు.
ప్యాకేజీ ధరలు
కాకేసియన్ దేశాలకు 4-రోజుల ప్యాకేజీ ఏప్రిల్ రెండవ వారం వరకు Dh1,499గా ఉన్నది.అయితే ఈద్ సెలవు తేదీలలో వీటి ధరలు రెట్టింపు అవుతాయి. జార్జియా వంటి దేశాల్లో హాలిడే ప్యాకేజీలు Dh3,000 నుండి Dh4,000 ధర పరిధిలో ఉన్నాయి. పారిస్, స్విట్జర్లాండ్లకు ఏడు రోజుల ప్యాకేజీలు Dh8,800 నుండి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







