7.4% పెరిగిన అవయవ మార్పిడి చికిత్సలు
- March 11, 2023
మస్కట్ : సుల్తానేట్లో అవయవ దానం అంగీకారం పెరుగుతోంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల నుండి ఎక్కువ మంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు. సౌత్ షర్కియాలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ ప్రకారం, ఒమన్లో ఇప్పటివరకు 347 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయి.2022లో ఇరవై నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 2021 కంటే ఇది 7.4 శాతం ఎక్కువ.ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రకారం, సుల్తానేట్లో 2021 చివరి వరకు 323 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. వివిధ రంగాల నుండి మొత్తం 7,092 మంది వ్యక్తులు అవయవ దానం కోసం షిఫా యాప్లో నమోదు చేసుకున్నారు. 1988 నుండి సుల్తానేట్లో మొత్తం అవయవ మార్పిడి 347 జరిగాయని, అందులో 325 కిడ్నీ మార్పిడి కాగా.. 22 కాలేయ మార్పిడి చికిత్సలు ఉన్నాయని సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







