7.4% పెరిగిన అవయవ మార్పిడి చికిత్సలు
- March 11, 2023
మస్కట్ : సుల్తానేట్లో అవయవ దానం అంగీకారం పెరుగుతోంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల నుండి ఎక్కువ మంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు. సౌత్ షర్కియాలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ ప్రకారం, ఒమన్లో ఇప్పటివరకు 347 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయి.2022లో ఇరవై నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 2021 కంటే ఇది 7.4 శాతం ఎక్కువ.ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రకారం, సుల్తానేట్లో 2021 చివరి వరకు 323 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. వివిధ రంగాల నుండి మొత్తం 7,092 మంది వ్యక్తులు అవయవ దానం కోసం షిఫా యాప్లో నమోదు చేసుకున్నారు. 1988 నుండి సుల్తానేట్లో మొత్తం అవయవ మార్పిడి 347 జరిగాయని, అందులో 325 కిడ్నీ మార్పిడి కాగా.. 22 కాలేయ మార్పిడి చికిత్సలు ఉన్నాయని సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







