ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
- March 11, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఈడీ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఈడీ అధికారులు కవితను విచారించడం మొదలుపెట్టారు. దాదాపు 09 గంటలపాటు కవిత ను విచారించిన అధికారులు తిరిగి 16 న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. విచారణ మధ్యలో 10 నిమిషాల పాటు కవిత కు బ్రేక్ ఇచ్చారు. విచారణ పూర్తి కాగానే కవిత నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి.
అయితే.. కవిత బయటికి రాగానే.. బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషాలు మొదలయ్యాయి. జై కవిత..జై కేసీఆర్ ..జై బిఆర్ఎస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఉదయం కవిత ఈడీ విచారణకు వెళ్లే సమయంలో అంత షాక్ లో ఉన్నారు. విచారణ పూర్తి కాగానే కవిత ను అరెస్ట్ చేస్తారనే వార్తలు ప్రచారం జరగడం తో కాస్త ఆందోళన చెందారు. సాయంత్రం నాటికీ కవిత బయటకు వస్తారని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరికాసేపట్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు హరీష్ రావు , కేటీఆర్ లు హైదరాబాద్ కు రాబోతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







