ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
- March 11, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఈడీ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఈడీ అధికారులు కవితను విచారించడం మొదలుపెట్టారు. దాదాపు 09 గంటలపాటు కవిత ను విచారించిన అధికారులు తిరిగి 16 న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. విచారణ మధ్యలో 10 నిమిషాల పాటు కవిత కు బ్రేక్ ఇచ్చారు. విచారణ పూర్తి కాగానే కవిత నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి.
అయితే.. కవిత బయటికి రాగానే.. బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషాలు మొదలయ్యాయి. జై కవిత..జై కేసీఆర్ ..జై బిఆర్ఎస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఉదయం కవిత ఈడీ విచారణకు వెళ్లే సమయంలో అంత షాక్ లో ఉన్నారు. విచారణ పూర్తి కాగానే కవిత ను అరెస్ట్ చేస్తారనే వార్తలు ప్రచారం జరగడం తో కాస్త ఆందోళన చెందారు. సాయంత్రం నాటికీ కవిత బయటకు వస్తారని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరికాసేపట్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు హరీష్ రావు , కేటీఆర్ లు హైదరాబాద్ కు రాబోతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







