ప్రేక్షకులను అలరించిన 'మెగా మ్యూజికల్ నైట్'
- March 11, 2023
ఖతార్: దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మ్యూజికల్ నైట్ (మార్చి 3న)ప్రేక్షకులను అలరించింది. ఇందులో భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ నుండి ప్రవాస ప్రతిభావంతులైన సంగీతకారులు, కళాకారులు పాల్గొన్నారు.దోహా మ్యూజిక్ లవర్స్ మెగా మ్యూజికల్ నైట్ విజయం సాధించడంపై గ్రూప్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సయ్యద్ రఫీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి న్యూ టెక్ ఇంజనీరింగ్-సర్వీసెస్, అల్ అక్వా నియోన్, సోనూ కౌంట్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఈ కార్యక్రమంలో టీపీఎస్ అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్, తెలంగాణ ఫుడ్ సన్కాన్స్ ఎండీ ప్రవీణ్ బయ్యాని, ఐసీబీఎఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ కేఎస్ ప్రసాద్, ఐసీసీ జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, టీజేక్యూ అధ్యక్షురాలు నందిని అబ్బగోని, ఏఎంయూ చైర్మన్ జావేద్ అహ్మద్, ఏఎంయూ అధ్యక్షుడు సయ్యద్ జాఫ్రీ, సెంట్రల్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు జై ప్రకాశ్ సింగ్, ఏకేవీ అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల, ఏకేవీ కార్యదర్శి విక్రమ్ సుఖవాసి, జైదా మోటార్స్ సీనియర్ మేనేజర్ కేటీ రావు, తెలంగాణ ప్రజాసమితి కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









