రాజకీయాలకు దూరం కావడానికి కారణాలు తెలిపిన రజనీకాంత్
- March 12, 2023
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసారు..కానీ చివరి నిమిషంలో ఆయన రాజకీయాల్లోకి రావడం లేదని తెలిపి షాక్ ఇచ్చారు. దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ఈ క్రమంలో తాను రాజకీయాలకు దూరం కావడానికి కారణాలు ఏంటి అనేది తెలిపారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో గతరాత్రి జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రజనీకాంత్ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే రాజకీయాలకు దూరమైనట్టు చెప్పారు. తాను ఆ సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని చెప్పారు. అయితే, రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందన్నారు. ఎక్కువ కార్యక్రమాలతో బిజీగా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదని అప్పట్లో డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తనకు సలహా ఇచ్చారని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.
తాను కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి సలహానే ఇచ్చినట్టు చెప్పారు. అప్పట్లో తాను బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకనే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. తాను ఈ విషయాలు చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకనే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్ర పదవి ఇవ్వడం తనకు నచ్చలేదన్నారు. ఆయన మరి కొన్ని రోజులు కేంద్రమంత్రిగా కొనసాగితే బాగుండేదన్నారు. గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారని అన్నారు రజనీకాంత్ . ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అలాగే వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..రజనీకాంత్ రాజకీయాల్లోకి రావొద్దనే చెప్పానన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే రాజకీయాల్లోకి రావొద్దని సలహా ఇచ్చానన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు ఒకటే మార్గం కాదని.. దానికి చాలా మార్గాలున్నాయని సూచించారు.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







