రోడ్డుప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్ర కు స్వల్పగాయాలు

- May 05, 2016 , by Maagulf

తిరుపతి నుంచి వస్తుండగా తాడేపల్లిలో పల్టీలు కొట్టిన కారు ♦  రోడ్డుప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్ర కు స్వల్పగాయాలు ♦  తాడేపల్లిలో మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స ♦  ప్రమాదంలో రవీంద్ర సహా నలుగురికి గాయాలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం అర్థరాత్రి తిరుపతి నుంచి తిరిగివస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు తాడేపల్లిలో పల్టీలు కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్రకు స్వల్పగాయాలు అయినట్టు తెలిసింది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా గాయాలు కావడంతో వారికి తాడేపల్లి మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com