బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్: దాసోజు శ్రవణ్
- March 15, 2023
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకైందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగింది.
పేపర్ లీక్ సూత్రధారి రాజశేఖర్ బండి సంజయ్, బీజేపీ ఫాలోవర్. కుట్రపూరితంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని బదునామ్ చేయాలనుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉండి పేపర్ లీకేజీకి పాల్పడ్డారు. బీజేపీ చేసిన రాజకీయ కుట్ర వల్ల లక్షల మంది యువత భవిష్యత్ అగమవుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
రాజశేఖర్ బీజేపీలో సోషల్ మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతడు బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు వాళ్లకు వాళ్లే ఆరోపణలు చేసుకోని బీజేపీ గ్రాఫ్ పడగొట్టుకున్నారు’’ అని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









