బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్: దాసోజు శ్రవణ్
- March 15, 2023
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకైందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగింది.
పేపర్ లీక్ సూత్రధారి రాజశేఖర్ బండి సంజయ్, బీజేపీ ఫాలోవర్. కుట్రపూరితంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని బదునామ్ చేయాలనుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉండి పేపర్ లీకేజీకి పాల్పడ్డారు. బీజేపీ చేసిన రాజకీయ కుట్ర వల్ల లక్షల మంది యువత భవిష్యత్ అగమవుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
రాజశేఖర్ బీజేపీలో సోషల్ మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతడు బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు వాళ్లకు వాళ్లే ఆరోపణలు చేసుకోని బీజేపీ గ్రాఫ్ పడగొట్టుకున్నారు’’ అని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!









