జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
- May 05, 2016
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. జంతర్ మంతర్ వద్ద ధర్నా అనంతరం పార్లమెంటుకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కాంగ్రెస్ ప్రముఖులనంతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సహా పలువురు పార్టీ నేతలను పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్కు తరలించారు. దిల్లీ పోలీసులు, ఎస్పీజీ సెక్యురిటీ అధికారులు పార్టీ నేతలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. బారికేడ్లు తొలగించి ర్యాలీ చేసేందుకు ప్రయత్నించడంతో నిబంధనలు ధిక్కరించారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







