జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత

- May 05, 2016 , by Maagulf
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. జంతర్ మంతర్ వద్ద ధర్నా అనంతరం పార్లమెంటుకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కాంగ్రెస్ ప్రముఖులనంతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సహా పలువురు పార్టీ నేతలను పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్కు తరలించారు. దిల్లీ పోలీసులు, ఎస్పీజీ సెక్యురిటీ అధికారులు పార్టీ నేతలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. బారికేడ్లు తొలగించి ర్యాలీ చేసేందుకు ప్రయత్నించడంతో నిబంధనలు ధిక్కరించారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com