మక్కాలో నలుగురు దాయిష్ తీవ్రవాదుల మృతి
- May 05, 2016
దాయీష్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరో ఇద్దరు తమను తాము పేల్చేసుకున్నారు. పవిత్ర మక్కా వెలుపల ఈ ఘటన చోటుచేసుకుందని ఇంటీరియర్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. భద్రతాదళాలపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపాయనీ, ప్రతిగా భద్రతా దళాలు ఎదురుదాడికి దిగాయనీ, ఈ ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారని అధికారులు వివరించారు. తమను తాము పేల్చేసుకున్న వ్యక్తులు బెల్టు బాంబుల్ని ఉపయోగించారని మినిస్ట్రీ వెల్లడించింది. ఈ ప్రమాదంలో సామాన్యులెవరూ గాయపడలేదు. సెక్యూరిటీ సిబ్బందికి సైతం గాయాలు కాలేదు. సౌత్ వెస్ట్రన్ బిషా ప్రావిన్స్లో ఇద్దరు దాయిష్ అనుమానిత వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియాలో తీవ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు నిత్యకృత్యంగా మారిపోయాయి.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?