మక్కాలో నలుగురు దాయిష్ తీవ్రవాదుల మృతి
- May 05, 2016
దాయీష్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరో ఇద్దరు తమను తాము పేల్చేసుకున్నారు. పవిత్ర మక్కా వెలుపల ఈ ఘటన చోటుచేసుకుందని ఇంటీరియర్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. భద్రతాదళాలపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపాయనీ, ప్రతిగా భద్రతా దళాలు ఎదురుదాడికి దిగాయనీ, ఈ ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారని అధికారులు వివరించారు. తమను తాము పేల్చేసుకున్న వ్యక్తులు బెల్టు బాంబుల్ని ఉపయోగించారని మినిస్ట్రీ వెల్లడించింది. ఈ ప్రమాదంలో సామాన్యులెవరూ గాయపడలేదు. సెక్యూరిటీ సిబ్బందికి సైతం గాయాలు కాలేదు. సౌత్ వెస్ట్రన్ బిషా ప్రావిన్స్లో ఇద్దరు దాయిష్ అనుమానిత వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియాలో తీవ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు నిత్యకృత్యంగా మారిపోయాయి.
తాజా వార్తలు
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్









