మక్కాలో నలుగురు దాయిష్ తీవ్రవాదుల మృతి
- May 05, 2016
దాయీష్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరో ఇద్దరు తమను తాము పేల్చేసుకున్నారు. పవిత్ర మక్కా వెలుపల ఈ ఘటన చోటుచేసుకుందని ఇంటీరియర్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. భద్రతాదళాలపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపాయనీ, ప్రతిగా భద్రతా దళాలు ఎదురుదాడికి దిగాయనీ, ఈ ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారని అధికారులు వివరించారు. తమను తాము పేల్చేసుకున్న వ్యక్తులు బెల్టు బాంబుల్ని ఉపయోగించారని మినిస్ట్రీ వెల్లడించింది. ఈ ప్రమాదంలో సామాన్యులెవరూ గాయపడలేదు. సెక్యూరిటీ సిబ్బందికి సైతం గాయాలు కాలేదు. సౌత్ వెస్ట్రన్ బిషా ప్రావిన్స్లో ఇద్దరు దాయిష్ అనుమానిత వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియాలో తీవ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు నిత్యకృత్యంగా మారిపోయాయి.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







