మక్కాలో నలుగురు దాయిష్‌ తీవ్రవాదుల మృతి

- May 05, 2016 , by Maagulf
మక్కాలో నలుగురు దాయిష్‌ తీవ్రవాదుల మృతి


దాయీష్‌ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరో ఇద్దరు తమను తాము పేల్చేసుకున్నారు. పవిత్ర మక్కా వెలుపల ఈ ఘటన చోటుచేసుకుందని ఇంటీరియర్‌ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. భద్రతాదళాలపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపాయనీ, ప్రతిగా భద్రతా దళాలు ఎదురుదాడికి దిగాయనీ, ఈ ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారని అధికారులు వివరించారు. తమను తాము పేల్చేసుకున్న వ్యక్తులు బెల్టు బాంబుల్ని ఉపయోగించారని మినిస్ట్రీ వెల్లడించింది. ఈ ప్రమాదంలో సామాన్యులెవరూ గాయపడలేదు. సెక్యూరిటీ సిబ్బందికి సైతం గాయాలు కాలేదు. సౌత్‌ వెస్ట్రన్‌ బిషా ప్రావిన్స్‌లో ఇద్దరు దాయిష్‌ అనుమానిత వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియాలో తీవ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు నిత్యకృత్యంగా మారిపోయాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com