ముగిసిన ‘ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్’.. హాజరైన షేక్ అహ్మద్
- March 17, 2023
కువైట్: షేక్ జాబర్ అల్-అహ్మద్ కల్చరల్ సెంటర్లో జరిగిన 28వ ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా బుధవారం హాజరయ్యారు. ఫెస్టివల్ సందర్భంగా ఈ సంవత్సరం విశిష్టవ్యక్తి అవార్డును కవి, సౌదీ యువరాజు బాదర్ బిన్ అబ్దుల్-మొహ్సేన్ అల్-సౌద్కు ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. హిస్ హైనెస్ ది ప్రీమియర్ 2023 రాష్ట్ర బహుమతుల విజేతలను కూడా సత్కరించారు. కువైట్లోని నాగరిక ప్రతిష్టను ప్రతిబింబించే విధంగా ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించినట్లు హిస్ హైనెస్ షేక్ అహ్మద్ నవాఫ్ చెప్పారు. ఈసందర్భంగా ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి వారిని సత్కరించామన్నారు. ఈ ఫెస్టివల్ ను విజయవంతం చేయడం కోసం సమాచార మంత్రిత్వ శాఖ, నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ (NCCAL) సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు.ఇంకా ఈ కార్యక్రమంలో కువైట్లోని సౌదీ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సాద్ అల్-సౌద్, అమిరి దివాన్ సలహాదారు మహ్మద్ అబ్దుల్లా అబుల్హాసన్, సీనియర్ రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









