ముగిసిన ‘ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్’.. హాజరైన షేక్ అహ్మద్
- March 17, 2023
కువైట్: షేక్ జాబర్ అల్-అహ్మద్ కల్చరల్ సెంటర్లో జరిగిన 28వ ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా బుధవారం హాజరయ్యారు. ఫెస్టివల్ సందర్భంగా ఈ సంవత్సరం విశిష్టవ్యక్తి అవార్డును కవి, సౌదీ యువరాజు బాదర్ బిన్ అబ్దుల్-మొహ్సేన్ అల్-సౌద్కు ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. హిస్ హైనెస్ ది ప్రీమియర్ 2023 రాష్ట్ర బహుమతుల విజేతలను కూడా సత్కరించారు. కువైట్లోని నాగరిక ప్రతిష్టను ప్రతిబింబించే విధంగా ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించినట్లు హిస్ హైనెస్ షేక్ అహ్మద్ నవాఫ్ చెప్పారు. ఈసందర్భంగా ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి వారిని సత్కరించామన్నారు. ఈ ఫెస్టివల్ ను విజయవంతం చేయడం కోసం సమాచార మంత్రిత్వ శాఖ, నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ (NCCAL) సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు.ఇంకా ఈ కార్యక్రమంలో కువైట్లోని సౌదీ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సాద్ అల్-సౌద్, అమిరి దివాన్ సలహాదారు మహ్మద్ అబ్దుల్లా అబుల్హాసన్, సీనియర్ రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!









