ముగిసిన ‘ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్’.. హాజరైన షేక్ అహ్మద్

- March 17, 2023 , by Maagulf
ముగిసిన ‘ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్’.. హాజరైన షేక్ అహ్మద్

కువైట్: షేక్ జాబర్ అల్-అహ్మద్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన 28వ ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా బుధవారం హాజరయ్యారు. ఫెస్టివల్ సందర్భంగా ఈ సంవత్సరం విశిష్టవ్యక్తి అవార్డును కవి, సౌదీ యువరాజు బాదర్ బిన్ అబ్దుల్-మొహ్సేన్ అల్-సౌద్‌కు ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. హిస్ హైనెస్ ది ప్రీమియర్ 2023 రాష్ట్ర బహుమతుల విజేతలను కూడా సత్కరించారు. కువైట్‌లోని నాగరిక ప్రతిష్టను ప్రతిబింబించే విధంగా ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించినట్లు  హిస్ హైనెస్ షేక్ అహ్మద్ నవాఫ్ చెప్పారు. ఈసందర్భంగా ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి వారిని సత్కరించామన్నారు. ఈ ఫెస్టివల్ ను విజయవంతం చేయడం కోసం సమాచార మంత్రిత్వ శాఖ, నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ (NCCAL) సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు.ఇంకా ఈ కార్యక్రమంలో కువైట్‌లోని సౌదీ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సాద్ అల్-సౌద్, అమిరి దివాన్ సలహాదారు మహ్మద్ అబ్దుల్లా అబుల్‌హాసన్, సీనియర్ రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com