రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం
- March 19, 2023
యూఏఈ: దుబాయ్లోని రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో శనివారం చెలరేగిన మంటలను దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో రెండు గోదాములు పూర్తిగా ధ్వంసమైనట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం గురించి సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్కు సాయంత్రం 5.38 గంటలకు సమాచారం అందిందని, వెంటనే నాద్ అల్ షెబా అగ్నిమాపక కేంద్రం నుండి ఒక బృందం ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మంటలు రెండు గోదాములకు వ్యాపించాయని, సైట్ నుండి భారీగా పొగలు వచ్చాయని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







