ఒమన్లో కనీస వేతనంపై కార్మిక శాఖ సమీక్ష
- March 20, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో కనీస వేతనాన్ని OMR 360కి పెంచడానికి సమీక్ష కొనసాగుతోందని కార్మిక మంత్రి మహద్ బావిన్ ధృవీకరించారు. సమీక్షకు సంబంధించిన అంశాలలో సగటు నెలవారీ వేతనాలు, వార్షిక ద్రవ్యోల్బణం రేటు కూడా ఉన్నాయని తెలిపారు. ఒమన్ సుల్తానేట్లో కనీస వేతనం OMR 360-400 మధ్య ఉంటాయని భావిస్తున్నారు. వాస్తవానికి కార్మిక మంత్రిత్వ శాఖ 2020లో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయ డిగ్రీలు ఉన్నవారికి దీని కారణంగా అన్యాయం జరుగుతుందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అనంతరం మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వేతనాలను అర్హతలతో ముడిపెట్టరాదని మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఒమానిసేషన్ రేట్లను పెంచడం, పౌరులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడం కోసం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







