ఒమన్లో కనీస వేతనంపై కార్మిక శాఖ సమీక్ష
- March 20, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో కనీస వేతనాన్ని OMR 360కి పెంచడానికి సమీక్ష కొనసాగుతోందని కార్మిక మంత్రి మహద్ బావిన్ ధృవీకరించారు. సమీక్షకు సంబంధించిన అంశాలలో సగటు నెలవారీ వేతనాలు, వార్షిక ద్రవ్యోల్బణం రేటు కూడా ఉన్నాయని తెలిపారు. ఒమన్ సుల్తానేట్లో కనీస వేతనం OMR 360-400 మధ్య ఉంటాయని భావిస్తున్నారు. వాస్తవానికి కార్మిక మంత్రిత్వ శాఖ 2020లో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయ డిగ్రీలు ఉన్నవారికి దీని కారణంగా అన్యాయం జరుగుతుందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అనంతరం మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వేతనాలను అర్హతలతో ముడిపెట్టరాదని మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఒమానిసేషన్ రేట్లను పెంచడం, పౌరులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడం కోసం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









