ఒమన్లో కనీస వేతనంపై కార్మిక శాఖ సమీక్ష
- March 20, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో కనీస వేతనాన్ని OMR 360కి పెంచడానికి సమీక్ష కొనసాగుతోందని కార్మిక మంత్రి మహద్ బావిన్ ధృవీకరించారు. సమీక్షకు సంబంధించిన అంశాలలో సగటు నెలవారీ వేతనాలు, వార్షిక ద్రవ్యోల్బణం రేటు కూడా ఉన్నాయని తెలిపారు. ఒమన్ సుల్తానేట్లో కనీస వేతనం OMR 360-400 మధ్య ఉంటాయని భావిస్తున్నారు. వాస్తవానికి కార్మిక మంత్రిత్వ శాఖ 2020లో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయ డిగ్రీలు ఉన్నవారికి దీని కారణంగా అన్యాయం జరుగుతుందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అనంతరం మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వేతనాలను అర్హతలతో ముడిపెట్టరాదని మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఒమానిసేషన్ రేట్లను పెంచడం, పౌరులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడం కోసం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







