'వన్ బిలియన్ మీల్స్'ని ప్రకటించిన షేక్ మహ్మద్
- March 20, 2023యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 'వన్ బిలియన్ మీల్స్'ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 50 దేశాల్లోని బలహీనమైన కమ్యూనిటీలకు ఆహార సహాయాన్ని పొందేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడతారు. "ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు. రాబోయే దశాబ్దాల పాటు స్థిరమైన రీతిలో వందల మిలియన్ల భోజనాన్ని అందించడం మా చొరవ లక్ష్యం." అని షేక్ మహ్మద్ తన ట్వీట్లో తెలిపారు. షేక్ మహ్మద్ అరబిక్లో ట్వీట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. “సోదర సోదరీమణులారా.. పవిత్ర మాసం ప్రారంభంలో మా వార్షిక సంప్రదాయం ప్రకారం.. రమదాన్ లో 'వన్ బిలియన్ మీల్స్' ఎండోమెంట్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ” అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు