1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ అధ్యక్షుడు
- March 21, 2023
యూఏఈ: రమదాన్ మాసాన్ని పురస్కరించుకొని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 1,025 మంది ఖైదీలను జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించారు. ముఖ్యమైన ఇస్లామిక్ సందర్భాలలో యూఏఈలోని ప్రతి ఎమిరేట్ల పాలకులు ఖైదీలకు క్షమాభిక్ష పెడుతుంటారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు సామాజిక, వృత్తిపరమైన జీవితాలను గడపడానికి వీలుగా వారికి ఒక అవకాశం కల్పిస్తూ.. క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఈరోజు చంద్రుడు కనిపిస్తే.. పవిత్ర మాసం మార్చి 22 (బుధవారం) నుంచి ప్రారంభమవుతుంది. లేదంటే మార్చి 23 ( గురువారం) నుండి నెల ప్రారంభమవుతుంది. ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం రమదాన్ నెల ఉపవాసాలు చంద్రుడు కనిపించే సమయాన్ని బట్టి 29 లేదా 30 రోజులపాటు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..