1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ అధ్యక్షుడు
- March 21, 2023
యూఏఈ: రమదాన్ మాసాన్ని పురస్కరించుకొని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 1,025 మంది ఖైదీలను జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించారు. ముఖ్యమైన ఇస్లామిక్ సందర్భాలలో యూఏఈలోని ప్రతి ఎమిరేట్ల పాలకులు ఖైదీలకు క్షమాభిక్ష పెడుతుంటారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు సామాజిక, వృత్తిపరమైన జీవితాలను గడపడానికి వీలుగా వారికి ఒక అవకాశం కల్పిస్తూ.. క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఈరోజు చంద్రుడు కనిపిస్తే.. పవిత్ర మాసం మార్చి 22 (బుధవారం) నుంచి ప్రారంభమవుతుంది. లేదంటే మార్చి 23 ( గురువారం) నుండి నెల ప్రారంభమవుతుంది. ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం రమదాన్ నెల ఉపవాసాలు చంద్రుడు కనిపించే సమయాన్ని బట్టి 29 లేదా 30 రోజులపాటు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









