1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ అధ్యక్షుడు

- March 21, 2023 , by Maagulf
1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ అధ్యక్షుడు

యూఏఈ: రమదాన్ మాసాన్ని పురస్కరించుకొని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 1,025 మంది ఖైదీలను జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించారు.  ముఖ్యమైన ఇస్లామిక్ సందర్భాలలో యూఏఈలోని ప్రతి ఎమిరేట్‌ల పాలకులు ఖైదీలకు క్షమాభిక్ష పెడుతుంటారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు సామాజిక, వృత్తిపరమైన జీవితాలను గడపడానికి వీలుగా వారికి ఒక అవకాశం కల్పిస్తూ.. క్షమాభిక్ష ప్రసాదిస్తారు.  ఈరోజు చంద్రుడు కనిపిస్తే.. పవిత్ర మాసం మార్చి 22 (బుధవారం) నుంచి ప్రారంభమవుతుంది. లేదంటే మార్చి 23 ( గురువారం) నుండి నెల ప్రారంభమవుతుంది. ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం రమదాన్ నెల ఉపవాసాలు చంద్రుడు కనిపించే సమయాన్ని బట్టి 29 లేదా 30 రోజులపాటు కొనసాగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com