రియాద్ మెట్రోతో స్థానికులకు 23,000 ఉద్యోగాలు
- May 06, 2016
రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందార్ మల్టీ బిలియన్ రియాల్ ఖర్చుతో నిర్మిస్తున్న రియాద్ మెట్రో 23,000 మంది స్థానికులకు ఉద్యోగాల్ని కల్పిస్తుందని అన్నారు. నిర్మాణ సమయంలోనూ, కార్యకలాపాలు ప్రారంభమయ్యాక పెద్దయెత్తున మెట్రో ప్రాజెక్ట్ ఉద్యోగాలను కల్పిస్తుందని గవర్నర్ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్తో ఎంఓయూ సందర్భంగా కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ పరిశీలన సమయంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ ప్రాగ్రెస్ని గవర్నర్కి లేబర్ మినిస్టర్ ముఫ్రెజ్ అల్ హకాబని మరియు ఫైనాన్స్ మినిస్టర్ ఇబ్రహీమ్ అల్ అసాఫ్ వివరించారు. 2018 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ప్రిన్స్ ఫైసల్ తెలిపారు. ట్రైనింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, కో-ఆపరేషన్ ప్రోగ్రామ్స్ విత్ యూనివర్సిటీస్.. ఇవన్నీ కలగలిసి ప్రాజెక్ట్ అత్యద్భుతంగా పూర్తి అవుతుందనీ, సౌదీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేదిగా ఈ ప్రాజెక్ట్ ఉండాలని ఆకాంక్షించారు గవర్నర్ ఫైసల్. నిర్మాణ సమయంలో ఎంతో ఓర్పుతో వ్యవహరిస్తున్న రియాద్ వాసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సౌదీ అభివృద్ధిలో పౌరుల పాత్రను ఆయన కొనియాడారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







