అలెప్పో హింసపై అరబ్ లీగ్ ఆందోళన
- May 06, 2016
అరబ్ లీగ్, సిరియన్ సిటీ అలెప్పోలో జరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేసింది. కౌరోలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అరబ్ లీగ్ దేశాల ప్రతినిథులు పాల్గొన్నారు. అరబ్ లీగ్ ఎక్రెటరీ జనరల్ నబిల్ ఎలారబీ, ఖతార్ విజ్ఞప్తితో అలెప్పీపై ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈజిప్ట్లోని ఖతార్ అంబాసిడర్ మరియు అరబ్ లీగ్ శాశ్వత ప్రతినిథి సైఫ్ బిన్ ముకద్దమ్ అల్ బువాయినైన్ మాట్లాడుతూ, అలెప్పోలో జరుగుతున్న నేరాలు తక్షణం ఆగాల్సి ఉందనీ, అక్కడి పౌరులు అభద్రతతో జీవిస్తున్నారని ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నుంచి అలెప్పోలో జరుగుతున్న దాడుల్లో 280 మంది పౌరులు మృతి చెందారు. తిరుగుబాటుదారులు నగరంపై పట్టు కోసం హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని కైరోలో జరిగిన అరబ్ లీగ్ సమావేశంలో ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







