అలెప్పో హింసపై అరబ్‌ లీగ్‌ ఆందోళన

- May 06, 2016 , by Maagulf
అలెప్పో హింసపై అరబ్‌ లీగ్‌ ఆందోళన

అరబ్‌ లీగ్‌, సిరియన్‌ సిటీ అలెప్పోలో జరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేసింది. కౌరోలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అరబ్‌ లీగ్‌ దేశాల ప్రతినిథులు పాల్గొన్నారు. అరబ్‌ లీగ్‌ ఎక్రెటరీ జనరల్‌ నబిల్‌ ఎలారబీ, ఖతార్‌ విజ్ఞప్తితో అలెప్పీపై ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈజిప్ట్‌లోని ఖతార్‌ అంబాసిడర్‌ మరియు అరబ్‌ లీగ్‌ శాశ్వత ప్రతినిథి సైఫ్‌ బిన్‌ ముకద్దమ్‌ అల్‌ బువాయినైన్‌ మాట్లాడుతూ, అలెప్పోలో జరుగుతున్న నేరాలు తక్షణం ఆగాల్సి ఉందనీ, అక్కడి పౌరులు అభద్రతతో జీవిస్తున్నారని ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 22 నుంచి అలెప్పోలో జరుగుతున్న దాడుల్లో 280 మంది పౌరులు మృతి చెందారు. తిరుగుబాటుదారులు నగరంపై పట్టు కోసం హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని కైరోలో జరిగిన అరబ్‌ లీగ్‌ సమావేశంలో ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com