అలెప్పో హింసపై అరబ్ లీగ్ ఆందోళన
- May 06, 2016
అరబ్ లీగ్, సిరియన్ సిటీ అలెప్పోలో జరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేసింది. కౌరోలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అరబ్ లీగ్ దేశాల ప్రతినిథులు పాల్గొన్నారు. అరబ్ లీగ్ ఎక్రెటరీ జనరల్ నబిల్ ఎలారబీ, ఖతార్ విజ్ఞప్తితో అలెప్పీపై ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈజిప్ట్లోని ఖతార్ అంబాసిడర్ మరియు అరబ్ లీగ్ శాశ్వత ప్రతినిథి సైఫ్ బిన్ ముకద్దమ్ అల్ బువాయినైన్ మాట్లాడుతూ, అలెప్పోలో జరుగుతున్న నేరాలు తక్షణం ఆగాల్సి ఉందనీ, అక్కడి పౌరులు అభద్రతతో జీవిస్తున్నారని ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నుంచి అలెప్పోలో జరుగుతున్న దాడుల్లో 280 మంది పౌరులు మృతి చెందారు. తిరుగుబాటుదారులు నగరంపై పట్టు కోసం హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని కైరోలో జరిగిన అరబ్ లీగ్ సమావేశంలో ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









