ఇండియన్ ఎంబసీ పాస్పోర్ట్ కేంద్రం పని వేళల్లో మార్పు
- March 24, 2023
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో BLS ఇంటర్నేషనల్ భారతీయ పాస్పోర్ట్, వీసా సేవా కేంద్రాల కొత్త పని వేళలు అమల్లోకి వచ్చాయి. BLS కేంద్రాలు రమదాన్ సందర్భంగా శనివారం నుండి శుక్రవారం వరకు (అంటే వారంలో ఆరు రోజులు) ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పని చేస్తాయి. జవహార టవర్ - 3వ అంతస్తు, అలీ-సేలం స్ట్రీట్, కువైట్ నగరం, జ్లీబ్ అల్-షుయూక్ (అబ్బాసియా) ఆలివ్ సూపర్ మార్కెట్ భవనం M అంతస్తు, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, M ఫ్లోర్ మక్కా స్ట్రీట్ ఫహాహీల్ BLS కేంద్రాలు కొత్త పని వేళల్లో పనిచేస్తాయి.అయితే, కువైట్లోని భారత రాయబార కార్యాలయం తన సాధారణ పని వేళలలోనే పని చేస్తుందని ఎంబసీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









