ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో చెట్ల ప్రాముఖ్యత ఎంతో కీలకం: సీపీ చౌహాన్
- March 25, 2023
హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, రాచకొండ పోలీసులు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్, న్యూలాండ్ ల్యాబ్స్తో కలిసి ఈరోజు మేడిపల్లి గ్రామం, రాచకొండ కమిషనరేట్ భూమిలో 3000 మొక్కలతో మెగా ప్లాంటేషన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కమీషనర్ ఆఫ్ పోలీస్ D.S.చౌహాన్ అధ్యక్షత వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్లాంటేషన్ డ్రైవ్ను ప్రశంసించారు మరియు పర్యావరణంలోని ఆక్సిజన్ స్థాయిలను పునరుద్ధరించడంలో చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమం ప్రేరణ అని అన్నారు.ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇనిషియేటివ్ తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉందని కమిషనర్ తెలిపారు.అటవీ విస్తీర్ణం పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. చెట్లను నాటడం యొక్క ప్రాముఖ్యత మరియు పర్యావరణంపై దాని ప్రభావం గురించి ప్రజలకు ఖచ్చితంగా ప్రచారం చేయడం మరియు అవగాహన కల్పించడం అవసరం అని ఆయన అన్నారు.
న్యూలాండ్ ల్యాబ్స్ HR హెడ్ P.మచంద్ర మాట్లాడుతూ..ఈ మెగా ప్రాజెక్ట్తో తమ సంస్థ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. న్యూలాండ్ ల్యాబ్స్ ఉద్యోగులు మరియు అరోరా కళాశాల విద్యార్థులు సహా 200 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అమలు భాగస్వామిగా ఉన్న రోటరీ క్లబ్ వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించింది. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్ ఫారెస్ట్రేషన్ ప్రాజెక్ట్ చైర్మన్ Rtn. హిమాన్షు గుప్తా మరియు అధ్యక్షుడు Rtn. రోహిత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!







