చిరునామా లేని 16,848 కంపెనీ ఫైల్స్ సస్పెండ్..
- March 26, 2023కువైట్: చెల్లుబాటు అయ్యే పౌర చిరునామాలు లేని 16,848 కంపెనీల ఫైళ్లను కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) సస్పెండ్ చేసింది. ఆర్టికల్ 18 కింద ఈ కంపెనీల క్రింద 61,688 మంది కార్మికులు నమోదు చేసుకున్నారని తెలిపింది.కాగా కార్మికులు వారి చట్టపరమైన స్థితిని పునరుద్దరించటానికి ఒక నెల గ్రేస్ పీరియడ్ను ఇచ్చినట్లు అథారిటీ పేర్కొంది. "ప్రైవేట్ రంగంలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించేవారిపై నియంత్రణను కఠినతరం చేయాలని" మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు PAM తెలిసింది. అయితే, నిర్దిష్ట వ్యవధిలోగా చట్టపరమైన స్థితిని సరిదిద్దడంలో కంపెనీలు విఫలమైతే, యజమానులపై సంబంధిత దర్యాప్తునకు రిఫర్ చెయ్యనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!