ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ..
- March 27, 2023అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. గవర్నర్ను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు సీఎం జగన్. దాదాపు గంట 15 నిమిషాల పాటు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. విశాఖలో మంగళవారం జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్కు తెలియజేశారు సీఎం జగన్. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజెంట్ రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో సీఎం జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.
మంగళవారం విశాఖలో జరిగే జీ-20 సమావేశానికి వెళుతున్నారు సీఎం జగన్.ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు సైతం ఈ సదస్సుకు హాజరవుతున్నారు. విశాఖలో జీ-20 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కారు అతిథుల కోసం ఇప్పటికే ఘనంగా విందు ఏర్పాటు చేస్తుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..