విద్యార్థులకు ప్రారంభమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్
- March 28, 2023
కువైట్: షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్లో పాల్గొనే మిడిల్, హైస్కూల్ విద్యార్థుల కోసం ఫీల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను అల్-సాద్ ఫౌండేషన్ ఫర్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా కువైట్లోని GE టెక్నాలజీ సెంటర్కు విద్యార్థులు ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు. సైంటిఫిక్ ప్రాజెక్ట్లను అమలు చేసే విధానం గురించి GE నిపుణులతో సంభాషించి సాంకేతిక నైపుణ్యం, నైపుణ్యాలను పొందడం ఈ పర్యటన లక్ష్యం అని కాంపిటీషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఐషా అల్-హోలీ తెలిపారు. ఫీల్డ్ విజిట్లు విద్యార్థుల్లో ఆవిష్కరణలు, శాస్త్రీయ, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి దోహదపడుతుందని అన్నారు. 'న్యూ కువైట్ 2035' విజన్ని సాధించడానికి పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను వివరించారు. షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్తో సహకారం మరింత మంది బాలికలు, మహిళలను సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజినీరింగ్ రంగాలకు ఆకర్షించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెంటర్ డైరెక్టర్ జనరల్ అల్-రషీద్ తెలిపారు.
తాజా వార్తలు
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!







