విద్యార్థులకు ప్రారంభమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్
- March 28, 2023
కువైట్: షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్లో పాల్గొనే మిడిల్, హైస్కూల్ విద్యార్థుల కోసం ఫీల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను అల్-సాద్ ఫౌండేషన్ ఫర్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా కువైట్లోని GE టెక్నాలజీ సెంటర్కు విద్యార్థులు ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు. సైంటిఫిక్ ప్రాజెక్ట్లను అమలు చేసే విధానం గురించి GE నిపుణులతో సంభాషించి సాంకేతిక నైపుణ్యం, నైపుణ్యాలను పొందడం ఈ పర్యటన లక్ష్యం అని కాంపిటీషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఐషా అల్-హోలీ తెలిపారు. ఫీల్డ్ విజిట్లు విద్యార్థుల్లో ఆవిష్కరణలు, శాస్త్రీయ, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి దోహదపడుతుందని అన్నారు. 'న్యూ కువైట్ 2035' విజన్ని సాధించడానికి పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను వివరించారు. షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్తో సహకారం మరింత మంది బాలికలు, మహిళలను సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజినీరింగ్ రంగాలకు ఆకర్షించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెంటర్ డైరెక్టర్ జనరల్ అల్-రషీద్ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







