విద్యార్థులకు ప్రారంభమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్
- March 28, 2023
కువైట్: షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్లో పాల్గొనే మిడిల్, హైస్కూల్ విద్యార్థుల కోసం ఫీల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను అల్-సాద్ ఫౌండేషన్ ఫర్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా కువైట్లోని GE టెక్నాలజీ సెంటర్కు విద్యార్థులు ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు. సైంటిఫిక్ ప్రాజెక్ట్లను అమలు చేసే విధానం గురించి GE నిపుణులతో సంభాషించి సాంకేతిక నైపుణ్యం, నైపుణ్యాలను పొందడం ఈ పర్యటన లక్ష్యం అని కాంపిటీషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఐషా అల్-హోలీ తెలిపారు. ఫీల్డ్ విజిట్లు విద్యార్థుల్లో ఆవిష్కరణలు, శాస్త్రీయ, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి దోహదపడుతుందని అన్నారు. 'న్యూ కువైట్ 2035' విజన్ని సాధించడానికి పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను వివరించారు. షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్తో సహకారం మరింత మంది బాలికలు, మహిళలను సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజినీరింగ్ రంగాలకు ఆకర్షించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెంటర్ డైరెక్టర్ జనరల్ అల్-రషీద్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







