ప్రముఖ రెస్టారెంట్ చైన్ వ్యవస్థాపకుడు కన్నుమూత
- March 28, 2023యూఏఈ: ప్రసిద్ధ అంతర్జాతీయ రెస్టారెంట్ చైన్ దిన్ తాయ్ ఫంగ్ను స్థాపించిన యాంగ్ బింగ్-యి.. 96 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అంత్యక్రియల ఏర్పాట్లు కొనసాగుతున్నందున కుటుంబ సభ్యులు గోప్యత కోరినట్లు కంపెనీ తెలిపింది. యాంగ్ బింగ్-యి విజయగాథ చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. అతను 1947లో 20 సంవత్సరాల వయస్సులో కేవలం 20 డాలర్లు జేబులో పెట్టుకుని తైవాన్కు వెళ్లాడు. మొదట్లో తైవాన్లో వంట నూనెల వ్యాపారాన్ని స్థాపించడంతో ప్రారంభమైంది. మొదటగా తన భార్యతో కలిసి ఆవిరితో కూడిన చైనీస్ సూప్ కుడుములు లేదా జియావో లాంగ్ బావోను విక్రయించడం ప్రారంభించాడు. అనంతర కాలంలో యూఏఈ, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్తో సహా ప్రపంచవ్యాప్తంగా తన రెస్టారెంట్ల చైన్ ను యాంగ్ బింగ్-యి విస్తరించారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14