9 ఏళ్లలో ఒకే తేదీన ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి..!
- March 30, 2023
అబుధాబి: భారత దేశంలోని కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాకు చెందిన హలీమా ముస్తఫా, తైసీర్ అబ్దుల్ కరీమ్ దంపతులకు మార్చి 14 ప్రత్యేక రోజు. అబుధాబిలో నివసించే ఈ జంటకు గత 9 సంవత్సరాలలో ఆ తేదిన ముగ్గురు పిల్లలు జన్మించారు. కుమార్తె తనీషా తహాని 2014లో జన్మించగా.. ఇద్దరు కుమారులు ముహమ్మద్ ఎమిన్ 2018లో.. హైజిన్ హమ్ద్ 2023 మార్చి 14న జన్మించాడు. ఇది నమ్మశక్యం కాని అనుభూతి అని, పవిత్ర రమదాన్ మాసం తమ కుటుంబానికి అదనపు ప్రత్యేకతను తెచ్చిందని ముగ్గురు పిల్లల తల్లి హలీమా గర్వంగా చెప్పారు. తాము ప్రసవానికి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు వేయలేదని లులూ గ్రూప్ ఇంటర్నేషనల్లో కేటగిరీ మేనేజర్గా పనిచేస్తున్న తైసీర్ అన్నారు. ప్రస్తుతం తనీషా, ఎమిన్ ఇద్దరూ సన్రైజ్ ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అబుధాబిలోని బుర్జీల్ హాస్పిటల్లోని స్పెషలిస్ట్ ప్రసూతి, గైనకాలజీ డాక్టర్ పాతుకుట్టి మహమ్మద్ మాట్లాడుతూ.. ఒకే రోజు ముగ్గురు పిల్లలు పుట్టడం చాలా అరుదని, తన కెరీర్లో ఇలాంటి కేసు గురించి వినలేదన్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఇదే మొదటిది కావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫిబ్రవరి 20న ఒకే రోజున జన్మించిన ఐదుగురు తోబుట్టువుల పేరిట ఉంది. ఈ రికార్డు 1966లో నమోదైంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









