ఢిల్లీ విమానాశ్రయం నుండి విమానాలు దారి మళ్లింపు..!
- March 30, 2023
న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు తొమ్మిది విమానాలను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం.. బుధవారం సాయంత్రం ఢిల్లీలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ మేరకు అనేక విమానయాన సంస్థలు ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. విమాన షెడ్యూల్లలో మార్పుల గురించి వారి ట్విట్టర్ ఫీడ్లో పోస్ట్ చేశాయి.
"ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కారణంగా ముంబై నుండి ఢిల్లీకి (BOM-DEL) UK910 విమానం జైపూర్కు (JAI) మళ్లించబడింది. 19:40 గంటలకు జైపూర్ చేరుకుంటుంది." అని ఏయిర్ విస్తారా వెల్లడించింది. "బెంగళూరులో ఆశించిన ప్రతికూల వాతావరణం కారణంగా.. విమానాల బయలుదేరడం /రాకపోకలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు మీ విమాన స్థితిని తనిఖీ చేయండి." అని ఇండిగో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







