ఢిల్లీ విమానాశ్రయం నుండి విమానాలు దారి మళ్లింపు..!
- March 30, 2023
న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు తొమ్మిది విమానాలను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం.. బుధవారం సాయంత్రం ఢిల్లీలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ మేరకు అనేక విమానయాన సంస్థలు ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. విమాన షెడ్యూల్లలో మార్పుల గురించి వారి ట్విట్టర్ ఫీడ్లో పోస్ట్ చేశాయి.
"ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కారణంగా ముంబై నుండి ఢిల్లీకి (BOM-DEL) UK910 విమానం జైపూర్కు (JAI) మళ్లించబడింది. 19:40 గంటలకు జైపూర్ చేరుకుంటుంది." అని ఏయిర్ విస్తారా వెల్లడించింది. "బెంగళూరులో ఆశించిన ప్రతికూల వాతావరణం కారణంగా.. విమానాల బయలుదేరడం /రాకపోకలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు మీ విమాన స్థితిని తనిఖీ చేయండి." అని ఇండిగో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







