ఢిల్లీ విమానాశ్రయం నుండి విమానాలు దారి మళ్లింపు..!
- March 30, 2023
న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు తొమ్మిది విమానాలను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం.. బుధవారం సాయంత్రం ఢిల్లీలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ మేరకు అనేక విమానయాన సంస్థలు ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. విమాన షెడ్యూల్లలో మార్పుల గురించి వారి ట్విట్టర్ ఫీడ్లో పోస్ట్ చేశాయి.
"ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కారణంగా ముంబై నుండి ఢిల్లీకి (BOM-DEL) UK910 విమానం జైపూర్కు (JAI) మళ్లించబడింది. 19:40 గంటలకు జైపూర్ చేరుకుంటుంది." అని ఏయిర్ విస్తారా వెల్లడించింది. "బెంగళూరులో ఆశించిన ప్రతికూల వాతావరణం కారణంగా.. విమానాల బయలుదేరడం /రాకపోకలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు మీ విమాన స్థితిని తనిఖీ చేయండి." అని ఇండిగో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









