ఇక ఆన్లైన్లో స్కెంజెన్ వీసాల దరఖాస్తు..!
- March 30, 2023
యూఏఈ: స్కెంజెన్ దేశాలకు వెళ్లాలనుకునే యూఏఈ నివాసితులు అపాయింట్మెంట్ల కోసం ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. క్యూలో నిలబడి వీసాలను ప్రాసెస్ కోసం పాస్పోర్ట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే EU పర్మిట్ విధానాన్ని డిజిటలైజ్ చేయడానికి ఒక అడుగు దూరంలో ఉంది. EU సభ్య దేశాలు బుధవారం వీసా విధానాన్ని డిజిటలైజ్ చేసే ప్రతిపాదనపై చర్చించారు. ఈ కొత్త విధానం ఆన్లైన్లో వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వీడిష్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనెర్గార్డ్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కెంజెన్ వీసా చట్టబద్ధమైన ప్రయాణికులు దరఖాస్తు చేసుకోవడానికి సులభతరం చేస్తుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తు విధానం వీసా మోసాలను తగ్గిస్తుందని తెలిపారు. ఆన్ లైన్ లో వీసా దరఖాస్తు కోసం ప్రత్యేక ప్లాట్ఫారమ్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం.. వీసాలను డిజిటల్ ఫార్మాట్లో 2D బార్కోడ్గా, క్రిప్టోగ్రాఫికల్ సంతకంతో జారీ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







