ఇక ఆన్లైన్లో స్కెంజెన్ వీసాల దరఖాస్తు..!
- March 30, 2023
యూఏఈ: స్కెంజెన్ దేశాలకు వెళ్లాలనుకునే యూఏఈ నివాసితులు అపాయింట్మెంట్ల కోసం ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. క్యూలో నిలబడి వీసాలను ప్రాసెస్ కోసం పాస్పోర్ట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే EU పర్మిట్ విధానాన్ని డిజిటలైజ్ చేయడానికి ఒక అడుగు దూరంలో ఉంది. EU సభ్య దేశాలు బుధవారం వీసా విధానాన్ని డిజిటలైజ్ చేసే ప్రతిపాదనపై చర్చించారు. ఈ కొత్త విధానం ఆన్లైన్లో వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వీడిష్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనెర్గార్డ్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కెంజెన్ వీసా చట్టబద్ధమైన ప్రయాణికులు దరఖాస్తు చేసుకోవడానికి సులభతరం చేస్తుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తు విధానం వీసా మోసాలను తగ్గిస్తుందని తెలిపారు. ఆన్ లైన్ లో వీసా దరఖాస్తు కోసం ప్రత్యేక ప్లాట్ఫారమ్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం.. వీసాలను డిజిటల్ ఫార్మాట్లో 2D బార్కోడ్గా, క్రిప్టోగ్రాఫికల్ సంతకంతో జారీ చేయనున్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







