జహ్రాలో కాన్సులర్, మెడికల్ క్యాంపులు సక్సెస్
- April 01, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం మార్చి 31వ తేదీ శుక్రవారం జహ్రాలోని వాహా ప్రాంతంలోని డోడీ కిడ్స్ నర్సరీ స్కూల్లో నిర్వహించిన కాన్సులర్, మెడికల్ క్యాంప్ విజయవంతం అయింది. ఈ క్యాంపులకు పెద్ద సంఖ్యలో భారతీయ కమ్యూనిటీ ప్రజలు తరలివచ్చారు. కాన్సులర్ క్యాంప్ లో పాస్పోర్ట్ పునరుద్ధరణ, PCC, ఆన్-ది-స్పాట్ అటెస్టేషన్ సేవలతో సహా ఇతర కాన్సులర్ సేవలను పొందారు. రాయబార కార్యాలయం నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ (IDF) కువైట్లోని సీనియర్ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, కన్సల్టింగ్ సేవలను అందించారు. కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డా. ఆదర్శ్ స్వైక మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. మారుమూల ప్రాంతాలలో కాన్సులర్ సేవలను అందించడానికి ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని డా. ఆదర్శ్ స్వైక తెలిపారు. అంతకుముందు ఫిబ్రవరిలో వాఫ్రా ప్రాంతంలో కూడా ఇలాంటి శిబిరాలనే ఇండియన్ ఎంబసీ నిర్వహించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









