సర్వమత ఇఫ్తార్లో పాల్గొన్న దౌత్యవేత్తలు, మతాధిపతులు
- April 03, 2023
యూఏఈ: అల్ మనార్ ఇస్లామిక్ సెంటర్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో అనేక మంది మిషన్లు, మత పెద్దలు, ఇతర అతిథులు హాజరయ్యారు. హిందూ దేవాలయం, గురునానక్ దర్బార్ గురుద్వారా, చర్చిల నుండి మత పెద్దలు... యూకే, అమెరికా, భారతదేశం, పాకిస్తాన్, కొరియా, జపాన్, రష్యా, కెనడా కాన్సులర్ అధిపతులతో పాటు అనేక ఇతర మతాల అధిపతులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సుల్ జనరల్ మేఘన్ గ్రెగోనిస్, డిప్యూటీ కాన్సుల్తో కలిసి వచ్చి సర్వమత ఇఫ్తార్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ మత స్వేచ్ఛపై స్థాపించబడిందని, అమెరికాలో మొదటి దౌత్యవేత్త ఇఫ్తార్ విందు దాదాపు 200 సంవత్సరాల క్రితం వైట్ హౌస్లో జరిగిందని గ్రెగోనిస్ తెలిపారు. సర్వమత సామరస్యాన్ని నెలకొల్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా పలువరు దౌత్యవేత్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







