సర్వమత ఇఫ్తార్లో పాల్గొన్న దౌత్యవేత్తలు, మతాధిపతులు
- April 03, 2023
యూఏఈ: అల్ మనార్ ఇస్లామిక్ సెంటర్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో అనేక మంది మిషన్లు, మత పెద్దలు, ఇతర అతిథులు హాజరయ్యారు. హిందూ దేవాలయం, గురునానక్ దర్బార్ గురుద్వారా, చర్చిల నుండి మత పెద్దలు... యూకే, అమెరికా, భారతదేశం, పాకిస్తాన్, కొరియా, జపాన్, రష్యా, కెనడా కాన్సులర్ అధిపతులతో పాటు అనేక ఇతర మతాల అధిపతులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సుల్ జనరల్ మేఘన్ గ్రెగోనిస్, డిప్యూటీ కాన్సుల్తో కలిసి వచ్చి సర్వమత ఇఫ్తార్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ మత స్వేచ్ఛపై స్థాపించబడిందని, అమెరికాలో మొదటి దౌత్యవేత్త ఇఫ్తార్ విందు దాదాపు 200 సంవత్సరాల క్రితం వైట్ హౌస్లో జరిగిందని గ్రెగోనిస్ తెలిపారు. సర్వమత సామరస్యాన్ని నెలకొల్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా పలువరు దౌత్యవేత్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









