ఆస్తమా రోగులకు శుభవార్త
- May 07, 2016
మీరు ఎన్ని మందులు వాడినా ఆస్తమా తగ్గడం లేదా? డాక్టర్లను మార్చినా రోగం తగ్గడం లేదా? అలాంటి వారి కోసం చిన్న చిట్కా. ప్రతిరోజూ కొంత సమయం యోగా కోసం వెచ్చిస్తే రోగం మటుమాయం అవుతుందని ఓ సర్వే వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమా, ఉబ్బసంతో బాధపడే వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఊపిరి పట్టేయడం, విపరీతమైన దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఇవ్వన్నీ ఆస్తమా రోగులకు ఉండే లక్షణాలు. ఒకసారి ఆస్తమా బారిన పడితే తగ్గడం అంత ఈజీ కాదు. మందుల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టే దానికన్నా యోగా చేస్తేచాలని అంటోంది చైనీస్ యూనివర్శిటీ. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా పేషెంట్ల సమస్యకు పరిష్కారం కోసం పరిశోధనలు చేసింది. వెయ్యిమంది పురుషులు, మహిళలతో వరుసగా యోగా చేయించింది. తద్వారా కొన్ని ఫలితాలు కనిపించాయని అధ్యయనంలో గుర్తించింది. యోగాసనాల వల్ల ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ తగ్గించడం కోసం వాడే మందులు పరిమాణం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. యోగా వల్ల ఆస్తమా రోగులపై ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవంటున్నారు. భారత్ లో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న యోగా ఆస్తమా రోగులకు వరం లాంటిదని హాంగ్ కాంగ్ లో చైనీస్ యూనివర్శిటీ తేల్చడం విశేషం. ఆరు నెలలపాటు యోగాసనాలతో పాటు ధ్యానం వల్ల మెరుగైన ఫలితం కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







