ఆస్తమా రోగులకు శుభవార్త
- May 07, 2016
మీరు ఎన్ని మందులు వాడినా ఆస్తమా తగ్గడం లేదా? డాక్టర్లను మార్చినా రోగం తగ్గడం లేదా? అలాంటి వారి కోసం చిన్న చిట్కా. ప్రతిరోజూ కొంత సమయం యోగా కోసం వెచ్చిస్తే రోగం మటుమాయం అవుతుందని ఓ సర్వే వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమా, ఉబ్బసంతో బాధపడే వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఊపిరి పట్టేయడం, విపరీతమైన దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఇవ్వన్నీ ఆస్తమా రోగులకు ఉండే లక్షణాలు. ఒకసారి ఆస్తమా బారిన పడితే తగ్గడం అంత ఈజీ కాదు. మందుల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టే దానికన్నా యోగా చేస్తేచాలని అంటోంది చైనీస్ యూనివర్శిటీ. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా పేషెంట్ల సమస్యకు పరిష్కారం కోసం పరిశోధనలు చేసింది. వెయ్యిమంది పురుషులు, మహిళలతో వరుసగా యోగా చేయించింది. తద్వారా కొన్ని ఫలితాలు కనిపించాయని అధ్యయనంలో గుర్తించింది. యోగాసనాల వల్ల ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ తగ్గించడం కోసం వాడే మందులు పరిమాణం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. యోగా వల్ల ఆస్తమా రోగులపై ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవంటున్నారు. భారత్ లో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న యోగా ఆస్తమా రోగులకు వరం లాంటిదని హాంగ్ కాంగ్ లో చైనీస్ యూనివర్శిటీ తేల్చడం విశేషం. ఆరు నెలలపాటు యోగాసనాలతో పాటు ధ్యానం వల్ల మెరుగైన ఫలితం కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







