700,000 దిర్హామ్లను దోచుకున్న నలుగురికి జైలుశిక్ష
- April 06, 2023
దుబాయ్: దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలోని ఎలక్ట్రానిక్స్ కంపెనీ నుండి 709,000 దిర్హామ్లను దొంగిలించినందుకు ఆసియా జాతీయతకు చెందిన నలుగురు దొంగలు జైలు పాలయ్యారు. పోలీసు రికార్డుల ప్రకారం ఈ కేసు గత డిసెంబర్ నాటిది. ఓ వ్యక్తి తన ఎలక్ట్రానిక్స్ దుకాణాన్ని నలుగురు వ్యక్తులు బలవంతంగా దోచుకున్నారని ఫిర్యాదు దాఖలు చేశారు. తన ఉద్యోగి ఒకరు తనకు ఫోన్ చేసి సీఐడీ ఆఫీసర్లుగా నటిస్తున్న నలుగురి ముఠా దుకాణానికి వచ్చి సేఫ్ లాకర్ తెరవమని బలవంతం చేశారని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత వారు Dh709,000 దొంగిలించి పారిపోయారని పేర్కొన్నారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి నిఘా ఫుటేజీతో సహా ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. నలుగురు దొంగలను గుర్తించి, వారిలో ముగ్గురిని పొరుగున ఉన్న ఎమిరేట్లోని ఒక హోటల్లో అరెస్టు చేశారు. వారివద్ద నుంచి Dh600,000 రికవరీ చేశారు. ఎలక్ట్రానిక్స్ స్టోర్ నుండి దొంగిలించబడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. నలుగురు దొంగలకు(ఒక దొంగ గైర్హాజరులో) రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే వారికి Dh709,000 జరిమానా విధించారు. శిక్షను అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







