700,000 దిర్హామ్‌లను దోచుకున్న నలుగురికి జైలుశిక్ష

- April 06, 2023 , by Maagulf
700,000 దిర్హామ్‌లను దోచుకున్న నలుగురికి జైలుశిక్ష

దుబాయ్: దుబాయ్‌లోని నైఫ్ ప్రాంతంలోని ఎలక్ట్రానిక్స్ కంపెనీ నుండి 709,000 దిర్హామ్‌లను దొంగిలించినందుకు ఆసియా జాతీయతకు చెందిన నలుగురు దొంగలు జైలు పాలయ్యారు. పోలీసు రికార్డుల ప్రకారం ఈ కేసు గత డిసెంబర్ నాటిది. ఓ వ్యక్తి తన ఎలక్ట్రానిక్స్ దుకాణాన్ని నలుగురు వ్యక్తులు బలవంతంగా దోచుకున్నారని ఫిర్యాదు దాఖలు చేశారు. తన ఉద్యోగి ఒకరు తనకు ఫోన్ చేసి సీఐడీ ఆఫీసర్లుగా నటిస్తున్న నలుగురి ముఠా దుకాణానికి వచ్చి సేఫ్ లాకర్  తెరవమని బలవంతం చేశారని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత వారు Dh709,000 దొంగిలించి పారిపోయారని పేర్కొన్నారు.  నేరం జరిగిన ప్రదేశం నుంచి నిఘా ఫుటేజీతో సహా ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. నలుగురు దొంగలను గుర్తించి, వారిలో ముగ్గురిని పొరుగున ఉన్న ఎమిరేట్‌లోని ఒక హోటల్‌లో అరెస్టు చేశారు. వారివద్ద నుంచి Dh600,000 రికవరీ చేశారు. ఎలక్ట్రానిక్స్ స్టోర్ నుండి దొంగిలించబడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.  దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. నలుగురు దొంగలకు(ఒక దొంగ గైర్హాజరులో) రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే వారికి Dh709,000 జరిమానా విధించారు. శిక్షను అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com