హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కమిషనర్ చౌహాన్

- April 06, 2023 , by Maagulf
హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కమిషనర్ చౌహాన్

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ప్రశాంతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కమిషనర్ డి ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. సరూర్ నగర్ కట్ట దగ్గర జరుగుతున్న ఊరేగింపును కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఊరేగింపుల సమయంలో ఎటువంటి ఇబ్బందులూ శాంతి భద్రతల సమస్యలూ తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మతసామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.డీసిపి ఎల్ బి నగర్ సాయి, ఏసీపీ శ్రీధర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com