హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కమిషనర్ చౌహాన్
- April 06, 2023
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ప్రశాంతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కమిషనర్ డి ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. సరూర్ నగర్ కట్ట దగ్గర జరుగుతున్న ఊరేగింపును కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఊరేగింపుల సమయంలో ఎటువంటి ఇబ్బందులూ శాంతి భద్రతల సమస్యలూ తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మతసామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.డీసిపి ఎల్ బి నగర్ సాయి, ఏసీపీ శ్రీధర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







