$2,000 దాటిన బంగారం ధరలతో తగ్గిన కొనుగోళ్లు..!
- April 07, 2023
యూఏఈ: బంగారం ధరలు దుబాయ్లో బుధవారం ఔన్సుకు $2,020 దాటాయి. ఇది బంగారు ఆభరణాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బంగారు ఆభరణాల రిటైలర్లు చెబుతున్నారు. కాగా, ఈద్ అల్ ఫితర్, అక్షయ తృతీయ పండుగల సందర్భంగా అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు శుక్రవారం ఉదయం 0.63 శాతం క్షీణించి ఔన్సు బంగారం ధర 2,007.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యూఏఈలో 24K ధర గురువారం గ్రాముకు Dh242.75 వద్ద ముగిసింది. అయితే 22K, 21K మరియు 18K వరుసగా గ్రాముకు Dh224.75, Dh217.5 మరియు Dh186.5 వద్ద ట్రేడవుతున్నాయి.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ మాట్లాడుతూ..గత కొన్ని వారాలుగా మార్కెట్లో బంగారం ధర పెరిగిందని, దీంతో బంగారు ఆభరణాల విక్రయాలు తగ్గాయని తెలిపారు. " కొనుగోళ్లలో మందగమనం ఉంది. కానీ ఈద్, అక్షయ తృతీయ శుభ సందర్భంగా కొనుగోళ్లు తిరిగి పుంజుకుంటాయి " అని అహమ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







