$2,000 దాటిన బంగారం ధరలతో తగ్గిన కొనుగోళ్లు..!
- April 07, 2023
యూఏఈ: బంగారం ధరలు దుబాయ్లో బుధవారం ఔన్సుకు $2,020 దాటాయి. ఇది బంగారు ఆభరణాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బంగారు ఆభరణాల రిటైలర్లు చెబుతున్నారు. కాగా, ఈద్ అల్ ఫితర్, అక్షయ తృతీయ పండుగల సందర్భంగా అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు శుక్రవారం ఉదయం 0.63 శాతం క్షీణించి ఔన్సు బంగారం ధర 2,007.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యూఏఈలో 24K ధర గురువారం గ్రాముకు Dh242.75 వద్ద ముగిసింది. అయితే 22K, 21K మరియు 18K వరుసగా గ్రాముకు Dh224.75, Dh217.5 మరియు Dh186.5 వద్ద ట్రేడవుతున్నాయి.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ మాట్లాడుతూ..గత కొన్ని వారాలుగా మార్కెట్లో బంగారం ధర పెరిగిందని, దీంతో బంగారు ఆభరణాల విక్రయాలు తగ్గాయని తెలిపారు. " కొనుగోళ్లలో మందగమనం ఉంది. కానీ ఈద్, అక్షయ తృతీయ శుభ సందర్భంగా కొనుగోళ్లు తిరిగి పుంజుకుంటాయి " అని అహమ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









