$2,000 దాటిన బంగారం ధరలతో తగ్గిన కొనుగోళ్లు..!
- April 07, 2023
యూఏఈ: బంగారం ధరలు దుబాయ్లో బుధవారం ఔన్సుకు $2,020 దాటాయి. ఇది బంగారు ఆభరణాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బంగారు ఆభరణాల రిటైలర్లు చెబుతున్నారు. కాగా, ఈద్ అల్ ఫితర్, అక్షయ తృతీయ పండుగల సందర్భంగా అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు శుక్రవారం ఉదయం 0.63 శాతం క్షీణించి ఔన్సు బంగారం ధర 2,007.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యూఏఈలో 24K ధర గురువారం గ్రాముకు Dh242.75 వద్ద ముగిసింది. అయితే 22K, 21K మరియు 18K వరుసగా గ్రాముకు Dh224.75, Dh217.5 మరియు Dh186.5 వద్ద ట్రేడవుతున్నాయి.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ మాట్లాడుతూ..గత కొన్ని వారాలుగా మార్కెట్లో బంగారం ధర పెరిగిందని, దీంతో బంగారు ఆభరణాల విక్రయాలు తగ్గాయని తెలిపారు. " కొనుగోళ్లలో మందగమనం ఉంది. కానీ ఈద్, అక్షయ తృతీయ శుభ సందర్భంగా కొనుగోళ్లు తిరిగి పుంజుకుంటాయి " అని అహమ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!







